హుజూర్ నగర్  ఉప ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. సమయం దగ్గర పడడంతో చాలా బాగా టెన్సన్స్ మొదలుఅయ్యాయి. అదిగో కేసీఆర్ దిగిపోతే తమకే అధికారం అంటూ. అమిత్ షా రంగంలోకి దిగ్గడం కూడా  జరిగింది.. తెలంగాణలో పాగా వేయడమే తరువాయి అని అంటూ సమాచారం కూడా ఉంది. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా సాధించిన విజయాలతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బాగా హడావుడి చేయడం జరిగింది. అయితే ఆ మాటలన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు చేతల్లో చూపాల్సిన  అవసరం వచ్చింది.

హుజూర్  నగర్ ఉప ఎన్నిక బీజేపీకి  కూడా పెద్ద పరీక్షే ఎదురువతుంది అని తెలుస్తుంది. అక్కడ పార్టీని గెలిపించడానికి ముఖ్య నేతలంతా బరిలోకి కూడా దిగారు. తెలంగాణ రాష్ట్ర సమితి - కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు  ఎవరు గెలిచినా ఉపయోగం ఉండదు - కేవలం బీజేపీ గెలిస్తేనే ప్రయోజనం అని వారు ప్రచారం చేస్తున్నారు.


అయితే  ఇప్పటి వరకూ హుజూర్ నగర్లో బీజేపీ అభ్యర్థికి ఊపు అయితే పెద్దగా కనిపిచడం లేదు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని బీజేపీ నేతలు చేసుకునే ప్రకటనలకు ధీటుగా అక్కడ అభ్యర్థి కూడా ఊపు పెద్దగా  కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో అక్కడ బీజేపీ ఎలాంటి  ఫలితం లభిస్తుందో ఆసక్తిదాయకంగా మారింది ఇపుడు.


ప్రధానంగా ఇప్పటి వరుకు ఉన్న సమాచారం మేరకు.. హుజూర్ నగర్ లో పోటీ రెండు పార్టీల మధ్యనే ఉంది అని అర్థం అవుతుంది. టీఆర్ ఎస్ - కాంగ్రెస్ ల మధ్యనే అక్కడ పోటీ నడుస్తూ ఉంది. ఎవరు గెలిచినా..6  లేదా 7  శాతం ఓట్ల తేడా తో బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఈ తేడా ఓట్లకు సమానంగా ఇతర పార్టీలన్నీ ఓట్లను సంపాదించుకోవడమే పెద్ద గమనించవలసిన విషయం.. అనే ప్రచారమూ కోనసాగుతూ ఉంది. ప్రచారం ఆఖరి వరకూ చేసినా.. చిన్నాచితక పార్టీలు ఆఖరి రోజు అంతర్గతంగా ఒప్పందానికి వచ్చి ఏదో ఒక పార్టీకి తమ అనుచరవర్గంతో పని చేయించినా పెద్దగా ఆశ్చర్యం లేదనే ప్రచారం జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: