హర్యానా - మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీకి అస్త్రం దొరికినట్లు కనిపిస్తుంది. అదే జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ త్రీ సెవెన్టీ రద్దు చేయడం. కొన్ని నెలల కిందట బీజేపీ వాళ్లు ఆ నిర్ణయం తీసుకున్న సంగతి అందరికి తెలిసిందే కదా. బీజేపీ దశాబ్దాలుగా ఆ డిమాండ్ చేస్తూ వచ్చింది. తమకు అధికారం దక్కిన తొలి ఐదేళ్లలో కూడా ఆ పని చేయడం చూడలేదు.కానీ  ఇప్పుడు మాత్రం తిరుగులేని బలం ఉండటంతో ఆ ఆర్టికల్ ను రద్దు చేసేశారు.


అయితే రద్దు అయితే చేశారు కానీ - జమ్మూ కాశ్మీర్ లో ఇప్పటి వరకూ పరిస్థితులు సాధారణ స్థితికి రాలేదని స్పష్టంగా  తెలుస్తుంది. అక్కడ బీజేపీ మరియు ఇతర  పార్టీల నేతలను ఇంకా హౌస్ అరెస్టులో ఉంచారంటేనే పరిస్థితిని మనము అర్థం చేసుకోవచ్చు. అయితే కమలం పార్టీ వాళ్లు మాత్రం అక్కడ అంతా ప్రశాంతంగా ఉందని తెలుపుతున్నారు.


ఢిల్లీ నుంచి రాజకీయ నేతలను కూడా కశ్మీర్ లో అడుగుపెట్టనివ్వడం లేదు అంటే నమ్మండి. అయినా అంతా ఓకే అని బీజేపీ వాళ్లు చెప్తున్నారు. ఇదే సమయంలో ఎన్నికల ప్రచారంలో మోడీ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడం కూడా జరిగింది. తాము సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన ప్రచారం చేస్తున్నాడు. జమ్మూ కశ్మీర్ అంశాన్ని హర్యానా ఎన్నికల్లో మోడీ ప్రస్తావిస్తూ ఉండటం చాల గమనార్హం.


ఇలా  మోడీ ఎందుకు చేస్తున్నారనేది స్పష్టం అవుతున్న అంశమే కదా. ఎన్నికల్లో లబ్ధి కోసమే మోడీ ఆ పని చేస్తూ ఉన్నారు అని అందరు అనుకుంటున్నారు. ఆర్టికల్ త్రీ సెవెన్టీ రద్దును ఎన్నికల ప్రచార అస్త్రంగా బాగా మార్చుకున్నారు అని కనిపిస్తుంది. ఆ ఆర్టికల్ రద్దు అప్పుడే  చాలా మంది జనాలు దేశభక్తితో ఉప్పొంగి పోవడం కూడా జరిగింది. రెండు నెలల తర్వాత వారు ఆ విషయాన్ని మరిచిపోయి ఉండవచ్చు అందరు.కశ్మీర్ ఇంకా పరిస్థితుల్లోకి రాలేదని అక్కడి వారు తెలియచేస్తున్నారు. అక్కడ అసెంబ్లీ లేదు. ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: