ఆంధ్రలో మంచిగా పాలన చేస్తే చాలదు.. తమ పాలన గురించి విపులంగా చెప్పుకోవాలి - గణాంకాలు చెప్పి - గతానికి - ఇప్పటికి ఉన్న తేడా ఏమిటో చెప్పలి.. ఏ రాజకీయ పార్టీకి అయినా ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే కదా. అయితే ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతలు మాత్రం ఈ విషయాలను గమనించినట్టుగా లేదు అని కనిపిస్తుంది.
ప్రస్తుతం టీవీ డిబేట్ కార్యక్రమాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల వాదనలు అంత గట్టిగా వినిపించడం లేదు అంటే చూడాలి మరి. చంద్రబాబు నాయుడు తీరులో - తెలుగుదేశం తీరులో బోలెడన్ని తప్పులు ఉన్నాయి. అలాగే
జగన్ పాలనలో సరిచేసిన అంశాలూ కూడా చాల ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ వాళ్లు అన్నీ తమ ఘనతలుగానే చెప్పుకుంటూ వస్తున్నారు.
ఆఖరికి నవరత్నాలు పథకాలు కూడా వాళ్ళవే అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్లు తెలుపుతున్నారు. ఇలా మాట్లాడి టీడీపీ నవ్వుల పాలే అవకాశం అవుతుంది. కానీ గట్టిగా రిటర్న్ ఇవ్వడంలో మాత్రం వైసీపీ నేతలు అంత ఊపు మీద కనపటడంలేదు. అందుకు కారణం.. వారి వద్ద సరైన సమాచారం లేకపోవడం - లేక గణాంకాలు తెలియకపోవడం - సమర్థవంతంగా వాదించడం చేతగాక పోవడం అని తెలియడం లేదు. ఉదయం లేస్తే టీవీ చానళ్లలో ఎప్పుడు చర్చా కార్యక్రమాలు కోనసాగుతూ ఉంటాయి. అలంటి వాటిల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాస్త చేతనయ్యే వాళ్లను కూర్చో పెట్టలని పరిశీలకులు తెలియచేస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ తమ వాదనల విషయంలో బాగా చెలరేగుతుంది. అందుకు సంబంధించి ఆ పార్టీకి ఏర్పాట్లున్నాయి. నాలెడ్జ్ సెంటర్ అంటూ కూడా నడుపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సబ్జెక్ట్ లేని వాళ్లను వాదనకు పంపితే అంతే సంగతులే మరి. టీవీ చానళ్ల ప్రభావం - వాటిల్లో జరిగే చర్చా కార్యక్రమాల ప్రభావం కచ్చితంగా ఎంతో కొంత ఉంటుంది.