మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డికి ఆర్టీఏ అధికారులు షాక్ ఇచ్చారు. దివాకర్ ట్రావెల్స్ కు చెందిన 23 బస్సులు సీజ్ చేశారు. ఆర్టీఏ కమిషనర్ సీతారామాంజనేయులు, జాయింట్ కమీషనర్  ప్రసాద్ రావు ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించడం జరిగింది. దివాకర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవటం, ఇష్టానుసారంగా టికెట్ల ధరలను పెంచటం వంటి ఆరోపణలు వచ్చాయని, అవి నిజమేనని తేలటంతో సీజ్ చేసినట్లు ఆర్టీఏ అధికారులు తెలియచేస్తున్నారు.


ఒక్క రూట్ కోసం పర్మిషన్ తీసుకొని, మరో రూట్ లో నడుపుతున్నారన్న ఆరోపణలు వస్తుంది. కొన్ని బస్సులకు పర్మిట్ లు కూడా లేవని ఆరోపణలతో సీజ్ చేయడం జరిగింది అని తెలిపారు. దివాకర్ రెడ్డికి చెందిన 23 బస్సులతోపాటు మిగిలిన ప్రైవేట్ బస్సులను కూడా సీజ్ చేశామని అధికారులు తెలియచేసారు. అనంతపురం జిల్లాలోనే దివాకర్ రెడ్డికి చెందిన 8 బస్సులను సీజ్ చేయడం జరిగింది. అనంతపురంలో 4 బస్సులు, గుంతకల్ లో 3, పెనుగొండలో ఒక బస్సును ఆర్టీఏ అధికారులు సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన బస్సులను ఆర్టీసీ డిపోలో ఉంచినట్లు సమాచారం ఉంది. 


 కొన్ని బస్సులకు పర్మిట్ లు కూడా లేవనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో దివాకర్ రెడ్డికి చెందిన 23 బస్సులతో పాటు మిగిలిన వారి ప్రైవేట్ బస్సులను కూడా సీజ్ చేశామని అధికారులు తెలియచేసారు. వారికి గతంలో అనేక సార్లు చెప్పామని.. కానీ పట్టించుకోలేదని ఆర్టీఏ అధికారులు తెలిపారు. అనంతపురం జిల్లాలో దివాకర్ రెడ్డికి చెందిన 8 బస్సులు, మిగతా వారికి చెందిన 10 బస్సులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. 


తమ బస్సులనే కాకుండా అనేక కంపెనీలకు చెందిన బస్సులను కూడా సీజ్ చేశారని తెలియచేస్తున్నారు. దీనికి సంబంధించి అదికారులతో మాట్లాడమని చెబుతున్నారు. సీజ్ చేసిన బస్సులను విడిపించుకునే విధంగా ఇప్పటికే అధికారులతో మాట్లాడామని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో తెలియ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: