యజమాని అక్రమంగా బావినీళ్లను తోడేస్తున్నారని  ఆరోపణ చేసారు. ముంబైలో కేసు కూడా నమోదు అయంది. బావిలో నీటిని అమ్ముకొని రూ.73 కోట్లు సొమ్ము చేసుకున్నారని,కేసు పెట్టిన వ్యక్తి యజమాని పైనే  ఆరోపించారు. అక్రమంగా బావి నీళ్లను తోడేసినందుకు రూ. 73 కోట్లు చెల్లించాలని,డిమాండ్ చేస్తూ ముంబైలోని ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసారు. వినటానికి నమ్మకం కలుగకపోయిన ఇది నిజమే.ఏదో తమ ఇంటి అవసరాల కోసం ఆ నీటిని తోడుకున్నారు, అనుకుంటే మనం పప్పులో  కాలు వేసినట్టే. అది కూడా ఒకటి లేదా రెండ్రోజులు కాదు.ఏకంగా 11 ఏళ్లపాటు ఇది కొనసాగింది. రెండు బావుల్లోని నీటిని తోడి, ట్యాంకర్ల  సహాయంతో అమ్మేసి సొమ్ము చేసుకున్నారు నిందితుడు.


వివరాల్లోకి వెళ్ళితే, బొమాంజీ మాస్టర్ లేన్‌లోని పాండ్య మ్యాన్షన్ యజమాని, ముగ్గురు వాటర్ ట్యాంకర్ ఆపరేటర్లుతో  సహా మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేశారు. పాండ్య మ్యాన్షన్ యజమాని అయిన త్రిపుర ప్రసాద్ పాండ్య,అక్కడ భవనం ప్రాంగణంలో రెండు బావులను తవ్వించి,వాటి నుండి తమ కంపెనీ డైరెక్టర్లు మరియు వాటర్ ట్యాంకర్ ఆపరేటర్ల సాయంతో,సుమారు  6.1 లక్షల ట్యాంకర్ల నీటిని అక్రమంగా విక్రయించారని ఆర్టీఐ యాక్టివిస్ట్ అయిన సురేశ్ కుమార్ ధోకా త్రిపుర ప్రసాద్ పాండ్యపై  ఆరోపించారు. అక్రమంగా నీటిని తోడారని ఆర్టీఐ ద్వారా ఆధారాలు సేకరించి,కేసు నమోదు చేయడంలో ఆయన ముఖ్య  పాత్ర పోషించారు.


ఒక్కో ట్యాంకర్‌ దాదాపు  పది వేల లీటర్ల చొప్పున ఉంటే,ట్యాంకర్‌కు రూ.1200 వసూలు చేసినా,11 ఏళ్లలో కనీసం ఆయన  రూ.73.19 కోట్లు సంపాదించారని సురేశ్ కుమార్ ఆరోపించారు.ఆ బావులను తవ్వి,అక్రమ విద్యుత్ కనెక్షన్ ద్వారా మోటార్లతో నీటిని తోడేశారని పోలీసులకి  ఫిర్యాదు చేసారు. దీంతో యాగమని మరియు ఆపరేటర్
 పై ఐపీసీ సెక్షన్లు 379, 34ల కింద కేసులు నమోదు చేశారు.

బావులను తవ్వడం కోసం బిల్డింగ్‌ ప్లాన్‌ను మార్చారని,ఇదివరకే  లోక్‌మాన్య తిలక్ మార్గ్ పోలీసులు పాండ్య మ్యాన్షన్ యజమానులపై కేసు నమోదు చేశారు. హరిత ట్రిబ్యునల్ ఇకమీదట ఆ బావులను పూర్తిగా  మూసివేయాలని ఆదేశించారు. భూగర్భ జలాలను అక్రమంగా తరలించడం,చట్టానికి విరుద్ధం అని,వాళ్ళు శిక్షార్హలని ఇదివరకే,2018 అక్టోబర్లో మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: