ఇటీవలే చిరు మన  సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే.సైరా  సినిమా గురించి ముఖ్య విషయాలని చెప్పి - సినిమా చూడాలని జగన్ ని కోరారు. ఇక దీనికి సానుకూలంగా స్పందించిన జగన్ సైరా చూస్తానని చెప్పారు.అసలు వారి మధ్య రాజకీయాల గురించే చర్చే జరగలేదు. జగన్ రాజ్యసభ సీటు ఇస్తానని అసలు చెప్పలేదు.కానీ కొందరు దానిని వారుగా ప్రచారం చేశారు.చిరు కి జగన్ రాజసభ సిట్ ఆఫర్ చేసినట్లు పుకార్లు పుటించారు .  అసలు ఇదొక పెద్ద గాలి వార్త. వాళ్ళు సినిమా గురించి మాట్లాడుకుంటే రాజకీయాలకు ముడిపెట్టేశారు.ఇక చిరు మోది - అమిత్ షాను కలుస్తున్నారు. అలా అయితే ఆయన బీజేపీలోకి వెళ్లి.... రాజ్యసభకు ఎంపికై... కేంద్ర మంత్రి అవుతారని మళ్లీ కథలు అల్లేస్తారేమో..?


రాజకీయాలు వదిలేసి సినిమాలు వైపు వచ్చేసి మళ్ళీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు సైరా సినిమాతో సందడి చేస్తున్నారు.ఇంతకముందు కాంగ్రెస్ తరుపున రాజ్యసభ సభ్యుడుగా ఎంపికై 2012-2014 మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్ర మంత్రిగా పని చేశారు. తర్వాత చిరంజీవి రాజ్యసభ పదవి కాలం ముగియడంతో ఆయన రాజకీయలోకి పూర్తిగా దూరమైపోయారు.


అయినా దేశం మీద వున్నా ఇష్టం తో  సైరా సినిమా చేసారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరాలో నటించిన చిరు ఈ సినిమాను పలువురు ప్రముఖులను చూడమని ఆహ్వానిస్తున్నాడు.ఈ క్రమంలోనే జగన్ తో భేటీ అయితే కొందరు రాజ్యసభ అంటూ కథలు అల్లేశారు.                                                                                                                                                                                                 


మరింత సమాచారం తెలుసుకోండి: