తెలంగాణ.. ప్రస్తుతం దేశం మొత్తంలో మంచి రాజకీయ హాట్ టాపిక్ నడుస్తున్న రాష్ట్రము. ముఖ్యంగా హుజుర్ నగర్ బై ఎలక్షన్ ఒక వైపు అయితే అంత కన్నా పెద్ద విషయం ఏమిటంటే రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె. స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి తనదయిన శైలిలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన వార్నింగ్ లను కూడా ఏ మాత్రం లెక్కచేయకుండా ఆర్టీసీ కార్మికులు సమ్మెని ఉదృతంగా సాగిస్తున్నారు.


ఇక ఇది ఇలా ఉంటే ఆర్టీసీ సమ్మెపై ప్రగతి భవన్ లో సీఎం చంద్ర శేఖర రావు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రి అజయ్ తో పాటు ఆర్టీసీ, ఆర్టీఏ ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. ఈ రోజు కోర్టులో సమ్మెపై విచారణ జరగబోతుండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పై వీరందరూ చర్చిస్తున్నారు. ఆర్టీసీ సమ్మెపై సీఎంవో ఇవాళ మరో ప్రకటన కూడా  చేసే అవకాశం కూడా ఉంది. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజెయ్ తో పాటు ఇతర రవాణాశాఖ అధికారులతో సమావేశం కానున్నారు.


కానీ ఈ సమీక్షలో ప్రధానంగా ఈ రోజు కోర్టుకు సమాధానం ఇవ్వాల్సి ఉన్నది కాబట్టి ప్రభుత్వ పరంగా ఏం అభిప్రాయం చెప్పాల్సిందనేటువంటి కోణంలోనూ చర్చ జరుగుతుందన్న సమాచారం అందుతోంది. దీనితో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. 


దీనికి కారణం ఈరోజు కోర్టులో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో ప్రత్యామ్నాయ ఏర్పాటు ఏంటి పూర్తి స్థాయి ఎండీని నియమించాలని కూడా కోర్టు సూచించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎండి నియామకం పై కూడా ఈ సమావేశం లో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేపట్టారు అనేది కూడా కోర్టుకు వివరించాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే 21 వ తేదీ కల్లా కార్మికుల సెప్టెంబర్ నెల జీతాలకు సంబంధించి కూడా కోర్టుకు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన అంశాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో ఆర్టీసీ, రవాణా శాఖ ఉన్నతాధికారులు మంత్రితో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: