కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఈ నెల 21న ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎగ్జిట్ పోల్స్పై నిషేధం విధించింది. అయితే ఈరోజుతో ఎన్నికల హోరు మూగబోయింది.ఈ నెల 21వ తేదీన పోలింగ్ జరుగనున్నది. 24వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. అదే రోజున ఫలితాలు వెలువడుతాయి.

 

వివరాల్లోకి వెళ్తే.....ఎన్నికల కమిషన్ ముందుగా 64 శాసనసభ సీట్లకు ఒక లోక్సభ నియోజక వర్గానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.ఉప ఎన్నికలు జరుగున్న నియోజక వర్గాల వివరాలు ఈ కిందివిధంగా ఉన్నాయి. అస్సాంలో 4 బీహార్లో 5 ఛత్తీస్గఢ్లో 1 హిమాచల్ ప్రదేశ్లో 2 కేరళలో 5 మధ్యప్రదేశ్లో 1 మేఘాలయలో 1 ఒడిశాలో 1 పుదుచ్చేరిలో 1 పంజాబ్లో 4 రాజస్థాన్లో 2 సిక్కింలో 3 తమిళనాడులో 2 తెలంగాణలో 1 ఉత్తర్ ప్రదేశ్లో 11 అసెంబ్లి నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి.

 

ఉత్తర్ ప్రదేశ్లో సిటింగ్ ఎమ్మెల్యేలు ఆ పదవులకు రాజీనామాలు చేసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడంతో అక్కడ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు.మహారాష్ట్రలో 288 అసెంబ్లి నియోజక వర్గాలకు హర్యానాలో 90 అసెంబ్లి నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగనున్నాయి.

 

బీహార్లోని సమస్తిపూర్ మహారాష్ట్రలోని సతారా లోక్సభ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం గత కొంతకాలంగా అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేసి చేసి ఉన్నారు. 

 

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంకు తెరపడింది.ఇప్పుడు ఎన్నిక ప్రచారానికి తెరపడటంతో ప్రజలు ఊపీరి పీల్చుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: