హైదరాబాదీ సంచలన క్రీడాకారిని సానియా మీర్జా తన ఖాతాలో మరో రికార్డు నమోదు చేసుకుంది.   టెన్నిస్ లో శిఖరాగ్రానికి చేరుతూ, మహిళల డబుల్స్ లో నంబర్ 1 ర్యాంకు సాధించింది. ఇప్పటి వరకు భారత దేశంలో ఈ ఘనత ఎవ్వరూ సాధించలేదు. అలాంటిది  ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఒకప్పటి దిగ్గజం మార్టినా హింగిస్ తో కలిసి ఫ్యామిలీ సర్కిల్ కప్ సొంతం చేసుకున్న సానియా మహిళల టెన్నిస్ డబుల్స్ విభాగంలో శిఖరాగ్రానికి చేరి మకుటం లేని మహారాణిగా నిలిచింది.


టెన్నిస్ బాల్ రాకెట్ షాట్ కొడుతున్న సానియామిర్జా


సానియా ఎప్పటి నుంచో ఈ విజయాన్ని తన సొంతం చేసుకోవాలని చూస్తుది ఇప్పటికీ తన చిరకాల  స్వప్నాన్ని నిజం చేసుకుంది. ఇంతకుముందు పురుషుల డబుల్స్ లో భారత్ నుంచి లియాండర్ పేస్, మహేశ్ భూపతి కొంతకాలం నంబర్ వన్ ర్యాంక్ ను అనుభవించిన సంగతి అందరికి తెలిసిందే. సానియా సాధించిన ఘనత పట్ల పలువురు అభినందనలు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: