"గురు బ్రహ్మ, గురు విష్ణు గురు దేవో మహేశ్వరహ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః" మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ తల్లి దండ్రుల తర్వాత అంతటి స్థానం ఒక్క గురువుకే ఉంది. కానీ ఈ మద్య కొంత మంది ఆ స్థానానికి మచ్చ తెస్తున్నారు. ఉచ్ఛనీచాలు మరిచి విద్యార్థినులపై కామవాంచతో పైశాచిక చర్యలకు పాల్పపడుతున్నారు.

తాజాగా ఓ ఉపాద్యాయుడు కామవాంఛతో తన కూతురి వయస్సున్న విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఒకటి గురువు అన్న పదానికి కలంకం తెచ్చింది.  ఉపాధ్యాయుడు తన వద్ద పాఠాలు చెప్పించుకుంటున్న విద్యార్థిని చెరబట్టాడు. అమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే... పశ్చిమ  బెంగాల్ రాష్ట్రంలోని జల్‌పయ్ గురి జిల్లా.. మొయినాగురిలో  14 ఏళ్ల బాలిక ఓ ఉపాధ్యాయుడి వద్ద ట్యూషన్ చెప్పించుకునేది. విద్యా బుద్దులు నేర్చుకుందామనుకున్న ఆ విద్యార్థినపై ఉపాద్యాయుడి కన్నుపండింది తన కూతురు వయసు ఉన్న ఆ అమ్మాయిని ఎలాగైనా చెరపట్టాలనుకున్నాడు.

 పాఠశాల నుంచి వచ్చిన అమ్మాయి ఇంటికి వెళ్లి.. అక్కడి నుంచి ట్యూషన్ కు వెళ్లింది. ట్యూషన్‌కు వచ్చిన బాలికపై సమయం చూసి  ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.  బాలిక జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అమె తల్లిదండ్రులు మొయినాగురి పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు.  కోర్టు ఆ నీచునికి 15 రోజుల రిమాండ్ విధించింది. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం అస్పత్రికి తరలించారు 


మరింత సమాచారం తెలుసుకోండి: