దేవునిపై సంపూర్ణ భక్తి విశ్వాసాలనేవి ఉంటే భక్తుల సంరంక్షణ ఆయనే వహిస్తాడని అనేందుకు అనేక నిదర్శనా లున్నాయి. భగవంతుడు ఒక్కటే అయిననూ ఎవరూ ఏ పేరు పెట్టి పూజించి పిలిస్తే, ఆరూపంలోనే దర్శనమిస్తాడు భగవంతుడు. పాండవులంతా శ్రీకృష్ణుని పైనే భక్తి విశ్వాసాలుంచి తమ భారతమంతా కృష్ణుడు ఏది చెబితే అదే వారికి వేదం. కృష్ణుడు ఏమిచెబితే అదే చేశారు. కనుకనే నిత్యం వారి వెన్నంటి ఉండి పాండవులను ప్రతిక్షణం రక్షిస్తూండేవాడు. తనకు 16 ఏళ్ళకే ఆయుష్షు తీరిపోతుందని అటువంటి వరం ఆ శంకరుడే తన తల్లిదండ్రులకు ఇచ్చాడని తెలిపినా, మార్కేండయుడు అత్యంత భక్తితో, నమ్మకంతో ఆ ఈశ్వరుణ్ణి పూజించగా, ఆ పరమేశ్వరుడే ప్రత్యేక్షమై యముడ్ని దండించి మరీ మార్కేండియునికి చిరంజీవత్వం ప్రసాదించాడు. ఇంతకంటే నిదర్శనాలు మనకి ఇంకేమి కావాలి.!  

మరింత సమాచారం తెలుసుకోండి: