గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలలో 24 దేవతలున్నారన్నది మన పెద్దలమాట. గాయత్రీ మంత్రం పరబ్రహ్మ స్వరూపం.మోక్షపదాన్ని ఇస్తుంది. అందుకే గాయత్రీమంత్రానికి అంతటి ప్రాముఖ్యత.
"ఓం భూర్భవస్సువః తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్"
గాయత్రీమంత్రం 24 అక్షరాలలో —
1. “తత్” - గణేశుడు ,
2. “స” - నృసిం హస్వామి,
3. “వి” - విష్ణు,
4. “తు” - ఈశ్వరుడు,
5. “వ” - శ్రీకృష్ణ,
6. “రే” - రాధాదేవి,
7. “ణి” - లక్ష్మీదేవి,
8. “యం” - అగ్నిదేవుడు,
9. “భ” – ఇంద్రుడు,
10. “గో” – సరస్వతీదేవి,
11. “దే” – దుర్గాదేవి,
12. “వ” - హనుమాన్,
13. “స్య” - భూదేవి,
14. “ధీ” - సూర్యభగవానుడు,
15. “మ” - శ్రీరామచంద్రుడు,
16. “హి” - సీతాదేవి,
17. “ధి” - చంద్రుడు,
18. “యో” - యమధర్మరాజు,
19. “యో” - బ్రహ్మదేవుడు,
20. “న:” - వరుణదేవుడు,
21. “ప్ర” - నారాయణుడు,
22. “చో” – హయగ్రీవుడు,
23. “ద” - హంసదేవత,
24. “యత్” - తులసీమాత