ఒక రావి చెట్టు,
ఒక నిమ్మ చెట్టు,
ఒక మఱ్ఱి చెట్టు,
రెండు దానిమ్మ చెట్లు,
రెండు మాధీ ఫలపు చెట్లు, అయిదు మామిడి చెట్లు,
పది పూల చెట్లు నాటినవారు నరకానికి వెళ్ళరు.
వరాహ పురాణం శ్లోకం :
శ్లోకం :- అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీం ı
ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే పంచామ్ర వాపీ నరకం న యాతీ ıı
ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి మన పూర్వీకులు..
పై విషయాన్ని చిన్నప్పుడు స్కూల్స్ లో నేర్పి ఉంటే,
గత యాభై సంవత్సరాలలో ఎంత పెద్ద అడవి సృష్టించ బడి ఉండేదో ఊహించుకోవచ్చు.