ఈ సంవత్సరం టీమ్ ఇండియా విజయాల పరంపర కొనసాగిస్తుంది..ఆ మద్య ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ ల్లో నాలుగింటిలో చెత్తగా ఓడిపోయినా చివరి మ్యాచ్ నెగ్గి పరువు కాపాడుకుంది. తర్వాత 2016 టీ ట్వంటీ మూడు ఆటల్లో దుమ్మురేపి సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఈ మద్య జిరిగిన ఆటల్లో కూడా ప్రత్యర్థి జట్లపై విరుచుకు పడుతుంది. చిరకాల ప్రత్యర్థి జట్టైన పాకిస్థాన్ ని చిత్తుగా ఓడించింది. తాజాగా భారత్ జట్టుపై ఆస్ట్రేలియా  ఆటగాడు స్టీవ్ వా సంచలన వ్యాఖ్యలు చేశారు.

2016 టీ ట్వంటీ ప్రపంచ కప్ హాట్ ఫేవరేట్ భారత జట్టేనని పిచ్ లపై పూర్తి అవగాహన ఉండడం ఆ జట్టుకు లాభించనుండగా, మంచి ఫాంలో ఉండడం కూడా ఆ జట్టుకు అద్వితీయ విజయాలు అందించే అవకాశం ఉందని స్టీవ్ వా అభిప్రాయపడ్డాడు.

టీమిండియా


టీమిండియా ఆటగాళ్లు గత కొంత కాలంగా పోటీ పడుతూ..విజయాల బాటపట్టారని, అది సానుకూల ఫలితాలు తెచ్చేందుకు ఉపయోగపడుతుందని వా పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా కూడా టైటిల్ రేసులో ఉందని స్టీవ్ వా అన్నాడు.కేవలం ఒక్క ఓవర్ లో ఫలితం తారుమారయ్యే టీట్వంటీల్లో విజేతను ముందుగా పేర్కోవడం తొందరపాటు అవుతుందని స్టీవ్ వా తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: