మంగళవారం బ్రిస్బేన్ వేదికగా ఆసీస్ తో జరిగిన రెండో టీ 20 లో 17ఓవర్లోనే 117పరుగులకు ఆల్ ఔటైయ్యింది శ్రీలంక. తద్వారా అంతర్జాతీయ టీ 20ల్లో అత్యధిక సార్లు ఆల్ ఔటైన జట్టుగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు 24 మ్యాచ్ ల్లో శ్రీలంక ఆల్ ఔట్ కాగా 23 మ్యాచ్ ల్లో ఆల్ ఔటై బంగ్లాదేశ్ ఈజాబితాలో రెండో స్థానంలో కొనసాగుతుంది.
ఇక రెండో టీ20 లో కూడా శ్రీలంక చిత్తుగా ఓడిపోయింది. 118పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలో నే అలవోకగా ఛేదించింది. మొదటి మ్యాచ్ లో సెంచరీ తో చెలరేగిన ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్ లో కూడా 60పరుగులతో అజేయంగా నిలువగా స్టీవన్ స్మిత్ 53 పరుగులతో రాణించాడు. ఈవిజయంతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ ల సిరీస్ ను 2-0 తో కైవసం చేసుకుంది. నామమాత్రమైన మూడో మ్యాచ్ వచ్చే నెల 1 న జరుగనుంది.