హీరోయిన్ల కు ఏ మాత్రం తీసిపోకుండా గ్లామర్ తో యూత్ ను ఫిదా చేస్తుంది భారత మహిళా క్రికెటర్
ప్రియా పూనియా. ఇటీవలే భారత జట్టులో చోటు సంపాదించుకున్న రాజస్థాన్ కు చెందిన 23ఏళ్ళ
ప్రియా పూనియా 2019 ఫ్రిబవరి లో న్యూజిలాండ్ తో జరిగిన ఉమెన్స్ టీ 20 మ్యాచ్ తో అంతర్జాతీయ
క్రికెట్ లో కి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పటివరకు మూడు టీ 20 మ్యాచ్ లు ఆడిన
ప్రియా ఆమ్యాచ్ ల్లో విఫలమైంది. కానీ వన్డే ల్లో మాత్రం ఈ ఓపెనర్ అరంగేట్రం మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో అదరగొట్టింది.
అక్టోబర్ 9న
సౌతాఫ్రికా తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డే ల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియా ఆ మ్యాచ్ లో 75 పరుగులతో అజేయం గా నిలిచింది.
దాంతో తాజాగా ఆమె వెస్టిండీస్ పర్యటనకు కూడా ఎంపికైంది. ప్రస్తుతం భారత మహిళల జట్టు వెస్టిండీస్ లో పర్యటిస్తుంది. అందులో భాగంగా కరీబియన్ దీవుల్లో ప్రియా పూనియా ఎంజాయ్ చేస్తూ ఫోటోకు పోజ్ ఇచ్చింది. ఆ ఫోటో కాస్త నెటిజన్ల కనపడింది. దాంతో అచ్చం హీరోయిన్ లా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే భారత్ -వెస్టిండీస్ ల మధ్య శుక్రవారం మొదటి వన్డే మ్యాచ్ జరుగనుంది. భారత కాలమానప్రకారం రాత్రి 11 గంటలకు ఈమ్యాచ్ ప్రారంభం కానుంది.