ఏడాది  నిషేధం  తరువాత  యాషెస్  ద్వారా  తిరిగి టెస్టు  క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన  ఆస్ట్రేలియా స్టార్  ప్లేయర్  స్టీవ్ స్మిత్  ఆ  సిరీస్ లో నాలుగు మ్యాచ్ ల్లో  3 సెంచరీ లు 3హాఫ్ సెంచరీలతో    టోర్నీ  టాప్ స్కోరర్ గా  నిలిచి  పునరాగమనాన్ని   ఘనంగా చాటుకున్నాడు.  ఇక ఈ టెస్టు   సిరీస్ తరువాత ఆసీస్ ప్రస్తుతం  పాకిస్థాన్  తో  తమ సొంత గడ్డ పైటెస్టు  సిరీస్ లో  తలపడుతుంది. అందులో భాగంగా   తాజాగా  జరిగిన  మొదటి  టెస్టు  మ్యాచ్  లో ఇన్నింగ్స్  5పరుగుల తేడాతో  పాక్ ను మట్టికరిపించింది ఆస్ట్రేలియా. 

 
అయితే  ఈమ్యాచ్ లో  స్మిత్ మాత్రం  కేవలం నాలుగు పరుగులు చేసి దారుణంగా నిరాశ పరిచాడు.  పాక్ స్పిన్నర్ యాసిర్ షా  బౌలింగ్  లో  క్లీన్ బోల్డ్ అయ్యాడు స్మిత్.   టెస్టుల్లో యాసిర్  షా , స్మిత్  వికెట్ తీయడం ఇది ఏడో సారి. ఇక  బ్రిస్బేన్ టెస్టు లో   విఫలమైనందుకు తనను  తాను  శిక్షించుకున్నాడు స్మిత్.  ఇంతకీ ఆ శిక్ష  ఏంటంటే.. మ్యాచ్ అనంతరం కావాలనే టీం బస్సు  మిస్ చేసి  మూడు  కిలోమీటర్లు  పరుగెత్తి  హోటల్  కు చేరుకున్నాడు.  స్మిత్  ఇలా తనకు తాను శిక్ష విదించుకోవడం ఇది మొదటి సారి కాదు.  ఇంతకుముందు కూడా  ఇలాంటి చిన్న చిన్న శిక్షలను విదించుకున్నాడు.  అయితే రాణించినప్పుడు మాత్రం  చాకోలెట్ బార్ తో తనుకు  తానే ప్రోత్సహించుకుంటాడు.  ఇక  ప్రస్తుతం  ఐసీసీ టెస్టు  ర్యాంకింగ్స్ లో స్మిత్  అగ్ర స్థానంలో  కొనసాగుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: