27బంతుల్లో 50.. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన శివమ్ దూబే
టీమిండియా యంగ్ క్రికెటర్ శివమ్ దూబే కెరీర్ లో మొదటి హాఫ్ సెంచరీ సాధించాడు. త్రివేండ్రం వేదికగా వెస్టిండీస్ -భారత్ మధ్య జరుగుతున్న రెండో టీ 20 లో దూబే ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ లో వన్ డౌన్ లో వచ్చిన దూబే 30బంతుల్లో 4సిక్సర్లు , 3ఫోర్ల సాయంతో 54పరుగులు చేశాడు. ఈక్రమంలో మరింత దూకుడుగా ఆడే క్రమంలో అతను ,వాల్ష్ బౌలింగ్ లో హేట్మేయర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అంతకుముందు పోలార్డ్ వేసిన 9 ఓవర్ లో మూడు సిక్సర్ల తో అదరగొట్టాడు శివమ్ దూబే. మొత్తానికి దూబే ను మూడో స్థానం లో చేసిన ప్రయోగం ఫలించింది. ఈ ఇన్నింగ్స్ దూబే కెరీర్ నుమలుపు తిప్పిన ఆశ్ఛర్యపోనక్కర్లేదు. ఇక టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేదు. మొదటి మ్యాచ్ లో 62 పరుగులతో అదరగగొట్టిన కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. కాగా గత మ్యాచ్ లో నిరాశపరిచిన రోహిత్ శర్మ ఈమ్యాచ్ లో కూడా అదే ఫామ్ ను కొనసాగించాడు. వీరికి తోపాటు కెప్టెన్ కోహ్లి కూడా తొందరగానే ఔటయ్యాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ , శ్రేయాస్ అయ్యర్ క్రీజ్ లో కొనసాగుతున్నారు.