వన్డేలు , టెస్టుల్లో  సూపర్ ఫామ్ తో రికార్డులు మీద  రికార్డులు సృష్టిస్తున్న  టీమిండియా  స్టార్ ఓపెనర్ , హిట్ మ్యాన్ రోహిత్ శర్మ  టీ 20ల్లో మాత్రం  నిరాశపరుస్తూనే వున్నాడు.  ఇప్పటివరకు ఈఏడాది లో  13 టీ 20లు ఆడిన  రోహిత్..  25యావరేజ్ తో 325 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో  మూడు  హాఫ్ సెంచరీలు వున్నాయి.  ఇటీవల బంగ్లాదేశ్  తో జరిగిన టీ 20 సిరీస్  లో రెండో మ్యాచ్ లో  85పరుగులు  చేసి  ఫామ్ లోకి వచ్చినట్లే కనిపించిన రోహిత్ ఆతరువాతి మ్యాచ్ లో విఫలం కాగా  ప్రస్తుతం  వెస్టిండీస్ తో జరుగుతున్న  టీ 20 సిరీస్ లో మొదటి ,రెండు మ్యాచుల్లో  దారుణంగా  విఫలమై  చెత్త ఫామ్ ను కొనసాగించాడు.  కనీసం  చివరి  టీ20 లోనైనా  రోహిత్ మెరుపులు మెరిపించి  ఫామ్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. 
 
 
ఇక  ఈసిరీస్ లో  మొదటి మ్యాచ్ లో ఇండియా గెలువగా రెండవ మ్యాచ్ లో  వెస్టిండీస్  విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య  సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ బుధవారం ముంబై లోని వాంఖడే మైదానం లో జరగనుంది. మరి ఈమ్యాచ్ లో గెలిచి టీమిండియా  సిరీస్ ను కైవసం చేసుకుంటుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: