భారత్ తో జరుగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం 5రోజుల క్రితమే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. అయితే తాజాగా ఈ సిరీస్ కోసం మరొకరిని జట్టులోకి ఎంపిక చేసింది. అతనెవరో కాదో యువ ఓపెనర్ జన్నేమన్ మలాన్. ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే సిరీస్ తో అంతర్జాతీయ వన్డే క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలాన్ ఆసిరీస్ లో అరంగేట్రం మ్యాచ్ లో డకౌట్ కాగ రెండో మ్యాచ్ లో సెంచరీ చేసి జట్టును గెలిపించాడు.. నిన్న జరిగిన మూడో వన్డే లో 23పరుగులు చేశాడు అయితే మలాన్ ప్రదర్శన తో సంతృప్తి చెందిన బోర్డు చివరి నిమిషం లో అతన్ని టీమిండియా పర్యటనకు ఎంపిక చేసింది.