దేశంలోని కరోనా వైరస్ నేపథ్యంలో IPL - 2020 లీగ్ వాయిదా పడిన సంగతి అందరికి తెలిసిందే. దీనీతో ఏమి చేయలేని పరిస్థితులలో  చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తన సొంతూరు రాంచీకి బయల్దేరాడు. మాములుగా మర్చి 29న మొదలు అవ్వాలిసిన ఐపీఎల్‌ అది కాస్త ఏప్రిల్ 15 వరకు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. దీనితో చెన్నై ఫ్రాంఛైజీ తన ప్రాక్టీస్‌ సెషన్‌లో కాస్త విరామం తీసుకుంది. ఇంతటితో అక్కడ ఉండి ప్రాక్టీస్‌ చేస్తున్న ధోనీతో పాటు రైనా, రాయుడు, మురళి విజయ్ మరికొందరు ఆటగాళ్లు తమ తమ సొంత ఊర్లకి వెళ్లారు.

 

 

 

ప్రాక్టీస్ సెషన్‌ చివరి రోజులో ధోనీ అభిమానులు భారీగా స్టేడియానికి వచ్చారు. ఈ సందర్బంగా తన ఫాన్స్ కి ధోనీ సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ లు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్‌ తన అధికారిక ఖాతాలో పోస్ట్ కూడా చేసింది. ఇంకోవైపు కరోనా వైరస్ దేశంలో వేగంగా వ్యాపిస్తుండడంతో ఇప్పటికే పలు రాష్ట్రాల విద్యాసంస్థలు, క్రీడలు, ర్యాలీలు ఇలా అన్నిటికి సంబంధించి అన్ని రద్దయ్యాయి. ప్రస్తుతం దేశంలో 100కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇద్దరు మృతి చెందిన విషయం కూడా అందరికి తెలిసిన విషయమే..

మరింత సమాచారం తెలుసుకోండి: