తొలి టీ20 ప్రపంచకప్​ కోసం భారత తుది జట్టులో సచిన్​, ద్రవిడ్​, గంగూలీకి స్థానం దక్కకపోవడానికి గల కారణాన్ని టీమ్​ఇండియా మాజీ మేనేజర్​ లాల్​చంద్​ రాజ్​పుత్​ వెల్లడించాడు. ఆ టోర్నీకి కేవలం యువ ఆటగాళ్లను మాత్రమే ఎంచుకోవాలని అప్పటి కెప్టెన్​ ద్రవిడ్​ సూచించినట్లు తెలిపాడు. టీ20 ప్రపంచకప్​-2007 జట్టులో దిగ్గజ ఆటగాళ్లు సచిన్​, గంగూలీ, ద్రవిడ్​లకు స్థానం దక్కకపోవడం వెనకున్న కారణాన్ని తాజాగా వెల్లడించాడు మాజీ జట్టు మేనేజర్​ లాల్​చంద్​ రాజ్​పుత్​. ఈ మెగాటోర్నీలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని ద్రవిడ్​ సూచించాడని.. దాని వల్ల సీనియర్ ఆటగాళ్లైన సచిన్​, గంగూలీలకు అవకాశం దక్కలేదని తెలిపాడు.

 


"అవును అదే నిజం. 2007 టీ20 ప్రపంచకప్ తుదిజట్టు​లో గంగూలీ, సచిన్​లకు అవకాశం దక్కకపోవడానికి రాహుల్​ ద్రవిడే కారణం. ఆ ఏడాది ఇంగ్లాండ్​ పర్యటన తర్వాత టీ20 ప్రపంచకప్​లో పాల్గొనడానికి సరాసరి దక్షిణాఫ్రికా చేరుకుంది భారత జట్టు. ఈ టోర్నీకి యువ ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేయాలని రాహుల్​ ద్రవిడ్​ సూచించాడు. భారత్​ ఆ ట్రోఫీ గెలిచిన తర్వాత సచిన్​ బాధపడ్డాడు. ఎందుకంటే తాను చాలా ఏళ్లు జట్టుకు ఆడుతున్నాని చెబుతూ.. ప్రపంచకప్​ను ఒకసారైనా గెలవకపోయానని విచారాన్ని వ్యక్తం చేశాడు". - లాల్​చంద్​ రాజ్​పుత్​, టీమ్​ఇండియా మాజీ మేనేజర్​

 

 

ద్రవిడ్​ సలహాతో టీ20 ప్రపంచకప్​ కోసం సెలక్టర్లు కేవలం యువ ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేశారు. అందులో రోహిత్​ శర్మ, రాబిన్​ ఉతప్ప, శ్రీశాంత్​, ఆర్పీ సింగ్​తోపాటు అనుభవజ్ఞులైన ఎంఎస్​ ధోనీ, గౌతమ్​ గంభీర్​, వీరేంద్ర సెహ్వాగ్​, యువరాజ్​, హర్భజన్​ సింగ్​లను దక్షిణాఫ్రికాకు పంపారు. ధోనీలో ద్రవిడ్​, గంగూలీ లక్షణాలు కలిసి ఉన్నాయని అభిప్రాయపడ్డాడు లాల్​చంద్​ రాజ్​పుత్​. "నిజంగా చెప్పాలంటే ధోనీ చాలా శాంత స్వభావి. మైదానంలో నిర్ణయాలు తీసుకోవడంలో ముందుండేవాడు. ఎందుకంటే కెప్టెన్​ ఎప్పటికప్పుడు నిర్ణయాలను తీసుకోవాలి. సారథిగా అతను తీసుకునే నిర్ణయాలంటే నాకు ఇష్టం. గంగూలీ, ద్రవిడ్​ ఇద్దరి లక్షణాలు మహీలో ఉన్నాయి" అని వెల్లడించాడు లాల్​చంద్​.

మరింత సమాచారం తెలుసుకోండి: