క్రికెట్ చరిత్రలో ఎన్ని దేశాలు పోటీకి తలపడినా..భారత్ - పాకిస్థాన్ ల మద్య వచ్చే ఆట అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో క్యూరియాసిటీ ఉంటుంది.  ఈ రెండు దేశాలు తలపడుతుంటే..యావత్ ప్రపంచం మొత్తం టీవిలకు అతుక్కుపోతారు.  చిన్నాపెద్దా అనే తేడాలు లేకుండా ఎంతో ఉత్కంఠంగా ఆటను తిలకిస్తుంటారు.

నేడు ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో తలపడనున్న టీమిండియా దేశ వ్యాప్తంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు..భారత్ విన్ అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.  తాజాగా టీమిండియాకు రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ శుభాకాంక్షలు తెలిపాడు.

‘ఆసియా కప్‌లాంటి ఓ సూపర్‌ సీరీస్ లో పోటీపడుతున్న భారత జట్టుకు నా విషెస్‌’ అని విరాట్‌ మంగళవారం ట్వీట్‌ చేశాడు.  ప్రస్తుతం విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఆసియా కప్‌కు దూరమవడంతో, అతని స్థానంలో రోహిత్‌ శర్మ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: