క్రికెట్ అంటే చిన్నా పెద్ద ఎవ్వరైనా ఎంతో ఇష్టపడుతుంటారు.  ఈ మద్య క్రికెట్ మైదానంలో బరిలోకి దిగిన క్రికెట్ ప్లేయర్లు ప్రపంచ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.  అయితే కొంత మంది మాత్రం చాలా చెత్త రికార్డులు కూడా క్రియేట్ చేస్తున్నారు.  ఇటీవల టీమిండియా-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో 92 పరుగులకు ఆలౌట్‌ అయితేనే చాలా మంది ముక్కున వేలేసుకున్నారు. తాజాగా సీనియర్‌ ఉమెన్స్‌ టీ20 లీగ్‌లో భాగంగా మిజోరం-మధ్యప్రదేశ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మిజోరం మహిళా జట్టు కేవలం 9 పరుగులకే ఆలౌట్‌ అయి అందరికీ షాక్ ఇచ్చారు. 

ఇక పరువు కాపాడే ప్రయత్నంలో ఒక్క ఉమెన్ క్రికెట్ ప్లేయర్ ఆ సిక్స్ సాధించింది. పుదుచ్చేరిలోని పల్మైరా క్రికెట్‌ గ్రౌండ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 9మంది బ్యాట్స్‌ఉమెన్‌ డకౌట్లుగా వెనుదిరిగారు. ఓపెనర్స్..తర్వాత వచ్చిన నలుగురు డకౌట్ అయ్యారు.  ఐదో  బ్యాట్స్‌ ఉమెన్‌గా బరిలోకి దిగిన అపూర్వ భరద్వాజ్‌ క్రీజులోకి వచ్చిన తర్వాత ఆరు పరుగులు చేసింది.

తర్వాత ఆమె కూడా ఔట్ అయ్యింది.  ఆ తర్వాత వచ్చిన ఏ ఒక్కరూ ఒక్క పరుగు కూడా సాధించలేక పోయారు.  ఎక్స్ ట్రా రూపంలో మూడు పరుగులు రావడంతో మొత్తం 9 పరుగులకు ఆలౌట్ అయ్యారు.  అయితే బుధవారం కేరళతో జరిగిన మ్యాచ్‌లోనూ మిజోరం జట్టు 24 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: