నాగపూర్ లో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మద్య కాలంలో దూకుడు మీద ఉన్న టీమ్ ఇండియాతో ఇప్పుడు ఆస్ట్రేలియా ఆచీ తూచి ఆడటం మొదలు పెట్టింది.  తాజాగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగలడం మొదలు పెట్టాయి.   

Nathan Lyon vs India Nagpur ODI

తొలి ఓవర్ చివరి బంతికి రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. కమిన్స్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి జంపాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.   ప్రస్తుతం భారత్ స్కోరు వికెట్ నష్టానికి 5 పరుగులు. గ్రీస్ లో దావన్ కి కోహ్లీ జత అయ్యాడు.  


టాస్ ఓడిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ..ఒక వేళ టాస్ గెలిస్తే..బ్యాంటింగ్ చేయాలని భావించామని.. తొలి వన్డే ఆడిన జట్టే టీమిండియా తరపున బరిలోకి దిగింది. ఆసీస్ జట్టులో ఇద్దరు స్పిన్నర్లను తీసుకున్నారు. మ్యాచ్ కొనసాగే కొద్దీ స్పిన్నర్లకు లాభిస్తుందని అన్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసే వారికే ప్రయోజనం ఉండవచ్చని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: