ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లతో క్రికెట్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. త్వరలో వరల్డ్ కప్ క్రికెట్ అన్ని దేశాల టీమ్ లు సంసిద్దం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా నేడు 15 మంది ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ప్రకటించనున్నది, ఎవరికి స్థానం లభిస్తుందన్న అంశంపై అభిమానుల్లో టెన్షన్ నెలకొన్న వేళ, జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తన డ్రీమ్ టీమ్ ను ప్రకటించాడు.
కాగా, గంభీర్ ప్రకటించిన జట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సంజూ శాంసన్, కేదార్ జాదవ్, నవదీప్ సైనీ, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జస్ ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, చాహల్, కుల్దీప్ యాదవ్ వున్నారు.
కాకపోతే ఈ టీమ్ లో స్టార్ బ్యాట్ మాన్ ధోనీ పేరు లేకపోవడం గమనార్హం. ఎనిమిదేళ్ల క్రితం మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యంలో భారత జట్టు వరల్డ్ కప్ ను సాధించిన సంగతి తెలిసిందే.