నిన్న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తమను భయపెట్టాడని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు. చివరి బంతి వరకు ధోని వీర విహారం చేయడంతో మ్యాచ్ చేజారుతుందని తాము భయపడ్డామని చెప్పాడు. ఆదివారం రాత్రి బెంగళూరు వేదికగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడారు. చివరి వరకు మేము గట్టిగానే పోరాడాం. ఈ పిచ్లో 160 పరుగుల స్కోరును కాపాడుకోవడం మామూలు విషయం కాదు. చివరి బంతి అయితే ఎంతో ఉత్కంఠ రేపింది. మొత్తానికి మ్యాచ్ గెలవడం మాకెంతో సంతోషానిచ్చింది. మా బౌలర్లపై బ్యాట్తో విరుచుకుపడిన ధోని మమ్మల్ని చాలా భయపెట్టాడని అన్నాడు.
మ్యాచ్ మధ్యలో ఉండగా 175 పరుగుల స్కోరు చేసే అవకాశముందని అనుకున్నాం. అయితే అనుకున్న స్కోరు కంటే 15 పరుగులు తక్కువగా చేశాం. ఎక్కువగా ఫ్రంట్ ఫుట్ మీద ఆడే అవకాశం చెన్నై బౌలర్లు మాకు ఇవ్వలేద ని కోహ్లి వివరించాడు. చెన్నై బౌలర్లు ఫ్రంట్ ఫుట్ మీద ఆడే అవకాశం మాకు ఇవ్వలేదు. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడం అందుకు ఉదాహరణ. మొయిన్ అలీ, నవదీప్ సైనీ అద్భుతంగా రాణించారు' అని కోహ్లీ చెప్పుకొచ్చారు.