తెలుగువారికి గ‌ర్వకార‌ణ‌మైన వార్త ఇది. అంత‌ర్జాతీయంగా మ‌న‌కు ద‌క్కిన గుర్తింపు ఇది. ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ఇండియా మాజీ క్రికెటర్‌ , రెఫరీ జీఎస్‌‌‌‌ లక్ష్మికి ఐసీసీ అరుదైన అవకాశం కల్పించిం ది. ఇంటర్నేషనల్​ మ్యాచ్‌ రెఫరీల ప్యానెల్‌కు ఆమెను అంతర్జాతీయ క్రికెట్‌‌‌‌ సమాఖ్య (ఐసీసీ) ఎంపిక చేసింది. దీంతో, ఈ ప్యానెల్‌ కు ఎంపికైన తొలిమహిళా రెఫరీగా 51 ఏళ్ల లక్ష్మి రికార్డు సృష్టించింది. ఇప్పటిదాకా మూడు మహిళల వన్డేలు, మూడు టీ20లను పర్యవేక్షించి న ఆమె ఇప్పుడు అంతర్జాతీయ మ్యాచ్‌ల‌ల్లో రెఫరీగా వ్యవహరించేందుకు అర్హత సాధించింది.


రాజమండ్రిలో పుట్టిన లక్ష్మి.. 1986 నుంచి 2004 వరకు క్రికెటర్‌ గా కొనసాగింది. ఇండియా మహిళల టీమ్‌ తో పాటు ఆంధ్ర, రైల్వేస్‌‌‌‌, బిహార్‌ , ఈస్ట్‌‌‌‌జోన్‌ ,సౌత్‌ కు ప్రాతినిథ్యం వహించింది. అనంతరం2008–09 సీజన్‌ లో దేశవాళీ మహిళల క్రికెట్‌‌‌‌లోతొలిసారి రెఫరీగా వ్యవహరించింది. ‘ఇంటర్నేషనల్‌ ప్యానెల్‌కు సెలెక్ట్‌‌‌‌ అవడం ఐసీసీ నాకు ఇచ్చిన గౌరవం. దీనివల్ల క్రికెట్‌‌‌‌లో మహిళలకు కొత్తమార్గాలు తెరిచారు. క్రికెటర్‌గా, మ్యాచ్‌ రెఫరీగా నాకున్న సుదీర్ఘ అనుభవం అంతర్జాతీయ స్థాయిలో మంచి అధికారిగా పేరు తెచ్చుకునేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నా. ఈ సందర్భం గా ఐసీసీ, బీసీసీఐ అధికారులతో పాటు ఇన్నేళ్లుగా నాకు అండగా నిలిచిన సహచరులు, ఫ్యామిలీ మెంబర్స్‌కు థ్యాంక్స్‌ . వాళ్ల అంచనాలను అందుకొని, నా కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తానని భావిస్తున్నా’ అని జీఎస్‌ లక్ష్మి తెలిపింది.



మరింత సమాచారం తెలుసుకోండి: