భారత క్రికెట్ జట్టు వరల్డ్ కప్ సెమీఫైనల్లో ప్రవేశించింది. బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో టీమిండియా 28 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించింది.   315 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన బంగ్లా జట్టు 47  ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. 


ఆ జట్టులో ఆల్ రౌండర్ మహ్మద్ సైఫుద్దీన్ 51 పరుగులతో నాటౌట్ గా మిగిలాడు. సైఫుద్దీన్ 38 బంతులాడి 9 బౌండరీలు బాదాడు. ఇక, టీమిండియా బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్య 3 వికెట్లు సాధించాడు. కాగా, అంతకుముందు భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ సెంచరీ సాయంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 314 పరుగులు చేసింది.


కేఎల్ రాహుల్ 77 పరుగులు సాధించాడు.   మొన్నటి వరకు పసికూన జట్టు అంటూ బంగ్లాను అంటున్నా ఆ ఆటగాళ్లు కూడా తమ నైపుణ్యాన్ని పెంచుకోవం పెద్ద టీమ్ లకు సైతం సవాల్ విసరడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నిన్న భారత్ బౌలర్ల ముందు మాత్రం సాహూ అనక తప్పలేదు. ఈ విజయంతో భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే ఘనంగా సెమీస్ లో అడుగుపెట్టింది. ప్రపంచకప్ లో ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడిన భారత్ 6 విజయాలు, 13 పాయింట్లతో సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంది. కోహ్లీసేన తన చివరి లీగ్ మ్యాచ్ లో శ్రీలంకతో తలపడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: