ప్రపంచకప్లో భాగంగా భారత జట్టు ఇప్పటికే శ్రీలంకతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సెమీస్కు వెళ్లింది. ఇప్పుడున్న అంచనాల ప్రకారం సెమీస్లో భారత్ ఇంగ్లండ్తో తలపడవచ్చు. 15 రోజుల పాటు టీమిండియా క్రికెటర్లతో కుటుంబ సభ్యులు ఉండేందుకు బీసీసీఐ సమ్మతించిన విషయం తెలిసిందే. దీంతో పలువురు క్రికెటర్ల భార్యలతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఇంగ్లండ్ వెళ్లి మ్యాచ్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వెస్టిండిస్తో మ్యాచ్లో టీం ఇండియా హిట్ మేన్ రోహిత్శర్మ భార్య రితికకు పట్టరాని కోపం వచ్చేసింది.
మరి రితికకు ఎందుకు కోపం వచ్చింది ? అన్నది చూస్తే వెస్టిండీస్తో మ్యాచ్లో టీమిండియా హిట్మ్యాన్ రోహిత్ శర్మ వివాదస్పదంగా ఔటయ్యాడు. భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు విండీస్ ఫాస్ట్బౌలర్ కీమర్ రోచ్ వేసిన ఆరో ఓవర్ చివరి బంతి రోహిత్ బ్యాట్కు, ప్యాడ్కు మధ్యలోంచి కీపర్ షాయ్ హోప్ చేతుల్లోకి వెళ్లింది. వెస్టిండిస్ అవుట్కు అప్పీల్ చేసింది. అంపైర్ నాటవుట్ ఇచ్చినా విండీస్ రివ్యూకు వెళ్లింది.
భారత్కు వ్యతిరేకంగా ఫలితం వచ్చింది. కాగా, ఇది ఔటా..నాటౌటా అనే దానిపై పూర్తిగా స్పష్టత లేని క్రమంలో థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. క్లారిటీ లేనప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్గా బ్యాట్స్మెన్కు నిర్ణయం వదిలేస్తారు. కానీ అంపైర్ ఇలా చేయకుండా అవుట్గా ప్రకటించాడు. ఈ అవుట్ చూసిన వెంటనే రోహిత్ సతీమణి రితికా అసంతృప్తి వ్యక్తం చేశారు.
రోహిత్ ఔట్పై థర్డ్ అంపైర్ నిర్ణయానికి ప్రకటించే సమయంలో అన్ని కెమెరాలు రితిక వైపు తిరిగాయి. రోహిత్ను అవుటని ప్రకటించగానే ‘వాట్’అంటూ తీవ్ర అసహనానికి లోనయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తోంది.