ఇండోనేషియాలో జరుగుతున్న ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ లో భారత్ స్టార్ పి.వి సింధు సెమీ ఫైనల్ కు చేరింది.శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ లో సింధు ప్రపంచ మూడో ర్యాంకరైనా నోజోమి ఒకుహారా (జపాన్)ను సులభంగా  ఓడించింది. మొదట్లో కొంచెం కష్టపడినా తరువాత సులభంగా ఒకుహరా ను మట్టిగరిపించింది.



కేవలం 44 నిమిషాల్లోనే ఆమె21-14,21-7 తేడాతో ప్రత్యర్థిని ఓడించి గెలిచెంది. బెస్టాఫ్ త్రీ గా సాగే ఈ గేమ్ లో తొలి గేమ్ లో 5-5 తో ఆదిలో కష్టపడినా, సింధు తర్వాత వెనుదిరిగి చూడలేదు ఒకుహారా అనవసర తప్పిదాలతో భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. దీంతో తెలుగు అమ్మాయి తొలిగేమ్ లో 21-14 తో విజయం సాధించి, రెండో గేమ్ లో 11-6 తో ఒకుహార కొద్దిసేపు పోటీలో నిలిచింది.



కానీ సింధు విజృంభించడంతో ఒకుహారా తరువాత కేవలం ఒకే ఒక్క పాయింట్ మాత్రమే సాధించి, రెండో గేమ్ ను 21-7 తో ముగించిన సింధూ, మూడో గేమ్ ఆడకుండానే సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. ఆ తరువాత సెమీ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకరైన చైనా క్రీడాకారిణి చెన్ యుఫేతో ఆమె శనివారం తలపడనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: