ఇక ఆ టెస్ట్ లో రోహిత్ దూకుడు చూసి అతను టీం ఇండియా కు మరో సెహ్వాగ్ అవుతాడనే కామెంట్లు కూడా వచ్చాయి. తాజాగా వాటిని నిజం చేస్తూ రాంచి టెస్ట్ లో రోహిత్ మరోసారి చెలరేగిపోయాడు. కేవలం 250 బంతుల్లోనే అతను కెరీర్ లో మొదటి డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. ఇంతకుముందు సెంచరీలకు చేరువలో వున్నపుడు తన స్టైల్లో సెహ్వాగ్ సిక్సర్ల తో వాటిని పూర్తి చేశేవాడు. ఇప్పుడు రోహిత్ కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు. రాంచి టెస్ట్ లో సిక్సర్ తో సెంచరీ పూర్తి చేసిన రోహిత్ .. ద్విశతకాన్ని కూడా అదే స్టైయిల్లో పూర్తి చేశాడు. ఇక ఈ రోజు సెహ్వాగ్ బర్త్ డే కావడం విశేషం. అలా కెరీర్ లో టెస్టుల్లో మొదటి డబుల్ సెంచరీ తో ఓపెనర్ రోహిత్ శర్మ మాజీ ఓపెనర్ సెహ్వాగ్ కు మరిచిపోలేని బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు.