ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంది అంటారు. విజయం వెనుక ఉన్న లేకున్నా... గడ్డు పరిస్థితుల్లో తోడుగా నిలిచే సతీమణులు ఎందరు ఉంటారు. సోషల్ మీడియా పుణ్యమా అని అలంటి సంఘటనలు మనం ఈ రోజుల్లో చాలానే చూస్తున్నాం. టెస్టు, టీ20 ఫార్మట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి సర్పరాజ్ అహ్మద్ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)తప్పించడంతో చాల మంది బిన్నంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్పరాజ్ సతీమణి తన భర్తపై వస్తున్నా కొన్ని కామెంట్లకు సమాధానం ఇచ్చారు.
అతడి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సర్ఫరాజ్ కెరీర్ చరమాంకంలో పడిందని త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను సర్ఫరాజ్ సతీమణి ఖుష్బత్ సర్ఫరాజ్ ఖండించారు. తన భర్త ఇంకా సుదీర్ఘ కాలం క్రికెట్
ఆడి దేశానికి అనేక విజయాలను అందిస్తాడని ధీమా వ్యక్తం చేస్తోంది.
‘సర్ఫరాజ్ ఎందుకు రిటైర్మెంట్ తీసుకోవాలి? అతడి వయసు ఇప్పుడు 32 ఏళ్లే. ధోని వయసెంతా? అతడు రిటైర్ అయ్యాడా? 38 ఏళ్లైనా ధోని ఇంకా క్రికెట్ ఆడటం లేదా? మా ఆయన కచ్చితంగా తిరిగి జట్టులోకి వస్తాడు. సర్ఫరాజ్ లాంటి గొప్ప ఫైటర్స్ కెప్టెన్సీ నుంచి తప్పించడం లాంటి విషయాల పట్ల ఏ మాత్రం నిరాశ చెందరు అని పేర్కొంది. పీసీబీ నిర్ణయాన్ని శిరసా వహిస్తాం, అలాగే... కెప్టెన్సీ నుంచి తప్పించినంత మాత్రాన సర్ఫరాజ్ క్రికెట్ ప్రయాణం ముగిసిపోలేదు. కెప్టెన్సీ నుంచి తప్పించడంతో సర్ఫరాజ్ ఇంకా స్వేఛ్చగా ఆడతాడు’అంటూ ఖుష్బత్ పేర్కొంది.
మరోపక్క సర్ఫరాజ్ అహ్మద్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై ఆ దేశ మాజీ క్రికెటర్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని చాలా మంది తప్పుబట్టగా...ఇది శుభపరిణామం అని అతి కొద్ది మంది పేర్కొంటున్నారు. టీ20లో పాక్ను నంబర్ వన్ జట్టుగా తీర్చిదిద్దిన సర్ఫరాజ్పై వేటువేయడంపై మండిపడుతున్నారు. బాబర్ అజమ్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తే అతడి ఆటను దెబ్బతింటుందని జావెద్ మియాందాద్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.