ఇటీవల తిరుచ్చి లలితా జ్యువెలరీ చోరీ జరిగిన విషయం అందరికి తెలిసిందే కదా. ఈ చోరీ కేసులో మణికంఠన్, సురేశ్ ప్రధాన నిందితులు.ఇటీవల భారీ సంచలనంగా మారిన తిరుచ్చి లలితా జ్యువెలరీ చోరీ కేసులో నిందితుడు.. తాజాగా ఒక నటిని తనతో తీసుకెళ్లిన తరుణం మరో సన్సేషన్ గా మారింది. తిరుచ్చిలోని లలితా జ్యువెలరీలో రూ.13 కోట్ల విలువైన నగల్ని దోచేసిన గుర్తు తెలియని వ్యక్తుల్ని గుర్తించారు తిరుచ్చి పోలీసులు.


తిరుచ్చి సత్రం బస్టాండ్ కు దగ్గరే ఉండే లలితా జ్యువెలరీలో భారీ ఎత్తున చోరీ చేసిన వారిలో తిరువారూరు మడపురానికి చెందిన మణికంఠన్ ఒకరైతే. మరొకరు సురేశ్ గా. సురేశ్ మామ మురుగన్ గా గుర్తించడం జరిగింది. మురుగున్ గతంలో పలు చోరీ కేసుల్లో నిందితుడే కాదు. తెలుగు ఇండస్ట్రీలో  కూడా రెండు సినిమాలకు నిర్మాతగా పని చేశారు అని  తెలుస్తోంది.


ఇదిలా ఉండగా.. తన మామ మురుగున్ నిర్మించిన చిత్రాల్లో నటించిన సురేశ్ కూడా తాజాగా  చోరీలో భాగం  పంచుకున్నట్లుగా భావిస్తున్నారు అందరు. ఇదిలా ఉంటే. తాజాగా ఈ చోరీలో పాల్గొన్న మణికంఠన్ ను పోలీసులు పట్టుకోవటం. అతని దగ్గరున్న నాలుగు కేజీల బంగారాన్ని కూడా  స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా తనతో పాటు చోరీకి పాల్పడిన వారు మురుగున్. సురేశ్ అని తెలిపాడు పోలీసులకు.

ఇక  సురేష్ కు సంబంధించిన మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అతడో సినీ నటిని తనతో పాటు విదేశాలకు తీసుకెళ్లినట్లుగా తెలియచేస్తునారు.  చోరీ తర్వాత  ఒక నటిని తన వెంట తీసుకొని శ్రీలంకకు వెళ్లిపోయినట్లుగా భావిస్తున్నారు. అయితే. దొంగ వెంట వెళ్లిన నటి ఎవరు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అందరిలోనూ. సురేశ్ ను అదుపులోకి తీసుకుంటే కానీ పూర్తి  విషయాలు బయటకు రావని పోలీసులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: