ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ శాంసంగ్‌ గెలాక్సీ సిరీస్‌లో నాలుగు స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.  తాజాగా తమ కస్టమర్లకు దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ శాంసంగ్ శుభవార్త అందించింది. అంచనాలకు అనుగుణంగానే శాంసంగ్‌ తన తాజా బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ గెలాక్సీ ఆన్‌ 6 ను భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. 

మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్లు, శాంసంగ్ గెలాక్సీ ఏ6ప్లస్ స్మార్ట్‌ఫోన్లపై భారీగా ధరలను తగ్గించినట్లు కంపెనీ ప్రకటించింది.  2,000 వరకు తగ్గించినట్లు సంస్థ పేర్కొంది. తగ్గించిన ధరతో ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ ఏ6ప్లస్ స్మార్ట్‌ఫోన్ రూ. 23,990 లభిస్తోందని కంపెనీ స్పష్టం చేసింది.

పేటీఎం మాల్స్, అమెజాన్ స్టోర్ల ద్వారా ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. తగ్గించిన ఫోన్ల ధరలపై అదనంగా పేటీఎం మాల్ రూ. 3,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇచ్చింది. పేటీఎం మాల్స్‌లో ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ ఏ6ప్లస్ స్మార్ట్‌ఫోన్ రూ. 25,990గా ఉంది. 2018 మే నెలలో ఈ ఫోన్‌ను విడుదల చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: