గత కొంత కాలంగా టెలిఫోన్ రంగంలో ఎన్నో మార్పులు చేర్పులు వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టెలీకాం వ్యవస్థలో జియో వచ్చినప్పటి నుంచి నెట్ వర్క్ చార్జీలు భారీగా పడిపోవడం మొదలయ్యాయి. అన్ని కంపెనీవారు తమ కస్టమర్లకు ఎన్నో రకాల ఆఫర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా పండుగల నేపథ్యంలో వచ్చే ఆఫర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తాజాగా వోడాఫోన్ సంస్థ పలు అన్ లిమిటెడ్ రీఛార్జ్ ప్యాక్ లపై వంద శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ని ప్రకటించింది. ఈ క్యాష్ బ్యాక్ రూ.50 విలువ గల వోచర్ల రూపంలో లభిస్తుంది. వొడా ఫోన్ ప్రీపెయిడ్ వినియోగదారులకు 100 శాతం క్యాష్బ్యాక్ ఆఫర్ను ప్రకటించింది. ఈ ప్యాక్లను మై వొడాఫోన్ యాప్ ద్వారా రీచార్జి చేసుకున్న వారికి నిర్దేశిత వోచర్లు వస్తాయి.
వీటిని తదుపరి చేసుకునే రీచార్జిలకు ఉపయోగించుకుని ఆ మేర డిస్కౌంట్ను పొందవచ్చు. రూ.399, రూ.458, రూ.509 ప్యాక్లను రీచార్జి చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. రూ.399 రీచార్జికు 8 వోచర్లు, రూ.458కు 9, రూ.509 రీచార్జికి 10 వోచర్లను వోడాఫోన్ అందిస్తోంది. వీటిద్వారా తదుపరి రీచార్జ్ సమయంలో 100 శాతం క్యాష్బ్యాక్ పొందవచ్చు.