కూతురిని చంపుతామని బెదిరించి తల్లిని రేప్ చేసిన ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది..కన్న బిడ్డ ముందే వారు అమ్మతో అలా చేయడంతో ఆ పసికూన పరిస్థితి ఎవరికి రాకూడదు..బిడ్డను చంపుతామని బెదిరించి తల్లిని అతి కిరతకంకంగా ఆరుగురు మృగాలు దారుణంగా రేప్ చేశారు..తల్లి పరిస్తితి ఏమిటి అనేది ఆ చిన్నారికి అర్థంకాని అయోమయ స్థితిలో ఉండి పోయింది..

 

వివరాల్లోకి వెళితే..హోషియార్‌పూర్‌లోని మందిరాన్ని సందర్శించడానికి కుమార్తెతో సహా జమ్మూ నుంచి వచ్చిన మహిళపై ఆరుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తమకు లొంగకపోతే కూతురిని చంపేస్తామని బెదిరించి ఒకరి తర్వాత ఒకరు కొన్ని గంటల పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు...దీంతో ఆ మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్ళింది..

 

 

తన కూతురు వెంట్రుకలను ఇచ్చేందుకు హోషియార్‌పూర్‌లోని మందిరాన్నికి ఓ మహిళ వచ్చింది.అక్కడ వెంట్రుకల కార్యక్రమాన్ని ముగించుకొని తిరుగు ప్రయాణానికి సిద్దంగా ఉన్న ఓ మహిళ వేహిల్ కోసం వెయిట్ చేస్తుందని తెలుసుకున్న ఓ వ్యక్తి తన కారులో ఎక్కించుకుని వెళ్ళాడు.. మాటల్లో పెట్టీ మాయచేసాడు..పఠాన్‌కోట్‌లో దించుతానని చెప్పి కారు ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లాక ఆమెను మాటల్లో పెట్టి హజీపూర్‌ వైపు తీసుకెళ్లాడు. అక్కడు ఐదుగురు వ్యక్తులు కారులోకి ఎక్కారు. దీంత భయపడిన బాధితురాలు కారులో నుంచి దిగేందుకు ప్రయత్నించగా వారంతా అడ్డుకున్నారు.

 

అలా ఆమెను బంధించి కారులో తీసుకెళ్ళి ఒక నిర్మానుష్య ప్రాంతానికి ఆపారు..బాధితురాలు కేకలు వేయడంతో అరిస్తే నీ కూతురిని చంపేస్తామని బెదిరించి ఆరుగురు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత బాధితురాలిని కారులో ఎక్కించుకుని హైవేపై వదిలేసి వెళ్లిపోయారు. దీంతో బాధితురాలు నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన అఘాయిత్యం గురించి ఫిర్యాదు చేసింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: