ఎవరైనా ఏదైనా చేస్తే మధ్యవర్తిగా ఉండి కాపాడాల్సిన రక్షక భటులు కీచకుల్లగా ప్రవర్తిస్తే సమాజాన్ని కాపడేవారు ఎవరు..అసలు విషయానికొస్తే... తల్లి కూతుర్లపై కిరాతకంగా కామదహన్ని తీర్చుకున్నారు.. ప్రస్తుతం ఈ ఘటన జనాలను బయందోళనకు గురిచేస్తుంది.. వివరాల్లోకి వెళితే ఈ దారుణం గుంటూరు లో చోటుచేసుకుంది.. న్యాయపరమైన వృత్తిలో ఉండి ప్రజలను రక్షించాల్సిన పోలీసులే లైంగిక దాడులకు పాల్పడ్డారు.. 

 

 ప్రేమపేరుతో మోసపోయిన యువతి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కెంది. అక్కడ కూడా ఆమె వంచనకు గురైంది. బాధితురాలికి న్యాయం చేయాల్సిన ఓ ఎస్సై ఆమెపై కన్నేశాడు. తన కోరిక తీరిస్తే కేసులో సాయం చేస్తానని నమ్మించి.. బెదిరించి.. యువతిని లొంగదీసుకున్నాడు. నిస్సహాయురాలైన ఆమె అతని అధికారానికి తలవంచక తప్పలేదు. ఆమె తల్లిపై కన్నేసిన కానిస్టేబుల్ ఏకంగా లాడ్జికే రమ్మన్నాడు. ఈ ఘోరమైన ఘటన గుంటూరులో ఆలస్యంగా వెలుగుచూసింది.

 

ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. గతంలో శారదా కాలనీలో నివాసం ఉన్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన డేవిడ్ అనే యువకుడు ప్రేమిస్తున్నానంటూ కూతురు వెంట పడేవాడు. ఆమె కూడా అతనిని ప్రేమించింది. ఇద్దరూ కలిసి కొద్దికాలం తిరిగారు. అనంతరం పెళ్లి విషయం ఎత్తడంతో ముఖం చాటేశాడు....ఆ తర్వాత కలవడం మాట అటుంచితే కనిపించడం పూర్తిగా మారిపోయింది. దాంతో మోస పోయానని అనుకున్న యవతి పోలీసులను ఆశ్రయించారు..

 

అర్బన్ ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది. కూతురిపై ఎస్సై అత్యాచారానికి పాల్పడ్డాడని.. తమకు న్యాయం చేయాలని బాధితులు ఎస్పీని కోరారు.యువతిపై కన్నేసిన ఎస్సై ఆమెను ఎలాగైనా లోచరుచుకునేందుకు ప్రియుడు డేవిడ్ కూడా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాడని.. మిమ్మల్ని కూడా జైలుకు పంపాల్సి వస్తుందని భయపెట్టాడు. ఓ రోజు రాత్రి సడెన్‌గా ఇంట్లోకి వచ్చి తలుపు గడియ పెట్టేశాడు. తన కోరిక తీరిస్తే కేసులో సాయం చేస్తానని నమ్మించి లోబరుచుకున్నాడు... అంటూ ఫిర్యాదు చేశారు.. దీనిపై చాలా మంది ముందుకొచ్చి పోలీసులకు బుద్ది చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: