మ‌ర‌ద‌లు పెళ్లికి ఒప్పుకోలేద‌ని ఓ యువ‌కుడు అమానుషంగా ప్ర‌వ‌ర్తించాడు. ఎంత ప్ర‌య‌త్నించినా త‌న‌తో పెళ్లికి నిరాక‌రించింద‌ని బ‌ల‌వంతంగా తాళి క‌ట్టాడు. ఈ క‌ర్ణాట‌క హ‌జ‌న్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

 

త‌న మ‌ర‌ద‌లిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌ప‌డ్డ మ‌ను అనే యువ‌కుడు రోడ్డుపై నిల్చొని బ‌స్సు కోసం ఎదురు చూస్తుండ‌గా యువ‌తిని కిడ్నాప్ చేశాడు. త‌న స్నేహితుల సాయంతో యువ‌తిని బ‌ల‌వంతంగా కారులో ఎక్కించాడు. త‌న‌కు పెళ్లి ఇష్టం లేదని యువ‌తి ఏడుస్తూ వేడుకున్నా విన‌కుండా  ఆమె మెడ‌లో తాళి క‌ట్టాడు. తాళిక‌ట్టే స‌మ‌యంలో యువ‌తి క‌ద‌ల‌కుండా మ‌ను స్నేహితుడు గ‌ట్టిగా ప‌ట్టుకున్నాడు.

 

ఈ దృశ్యాల‌ను సెల్‌ఫోన్‌లో బంధించిన మ‌ను మ‌రో స్నేహితుడు సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. యువ‌తి త‌ల్లిదండ్రుల మేర‌కు కేసు ద‌ర్యాప్తు చేసిన పోలీసులు మ‌నుతోపాటు అత‌ని స్నేహితులు ప్రవీణ్‌ కుమార్, టీఎన్ వినయ్‌ల‌ను అరెస్టు చేశారు.  కారు డ్రైవ‌ర్ కేఏ సందీప్ ప‌రారీలో  ఉన్న‌ట్టు పోలీసులు తెలిపారు.కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో అమానుష ఘటన జరిగింది. బస్సు కోసం ఎదురు చూస్తున్న ఓ యువతిని అందరూ చూస్తుండగానే కొందరు అపహరించుకుపోయారు.

 

 

ఆ యువతిని కారులోకి లాక్కెళ్లగా, వారిలో ఒకరు ఆమెకు బలవంతంగా తాళి కట్టారు. యువతికి వరుసకు బావ అయిన మను అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. యువతి వివాహానికి నిరాకరించిందన్న ఆగ్రహంతో ఆమెను అపహరించిన మను.. వదిలేయాలని ఆమె ఎంత బతిమిలాడినా వినకుండా బలవంతంగా తాళి కట్టాడు. అయితే అమ్మాయి తల్లి దండ్రులు చేసిన ఫిర్యాదుకు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: