ఒకప్పుడు చాలా ఫేమస్ అయిన జావా బైకులు ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. జావా నుండి కొత్తగా రెండు వెహికల్స్ రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఒకటి జావా 42 అండ్ జావా పెరాక్ అనే రెండు మోడల్స్ వస్తున్నాయి. ఎంట్రీ లెవల్ జావా 42 బైక్ 1.55 లక్షల ధర నిర్ణయించగా.. జావా పెరాక్ ధర 1.65 లక్షలుగా నిర్ణయించబడింది.


ఈ జావా బైకులు రాయల్ ఎన్ ఫీల్డ్ బైకులకు గట్టి పోటీ ఇస్తాయనడంలో సందేహం లేదు. జావా నుండి వస్తున్న ఈ రెండు బైకులు 393 సిసి లిక్విడ్ కూల్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో వస్తుంది. ఇక 27 బి.హెచ్.పి 28 ఎన్.ఎం టార్క్ పవర్ తో వస్తుంది. 6 గేర్ స్పీడ్ తో వస్తున్న ఈ బైకులు అత్యాధునిక సాంకేతికతతో వస్తుంది.  


జావా నుండి వస్తున్న ఈ బైకులు మూడు ప్రత్యేక రంగుల్లో అందుబాటులోకి వస్తున్నాయి. జావా బ్లాక్, మెరున్, జావా గ్రే కలర్స్ లో వస్తున్నాయి. త్వరలో రిలీజ్ అవుతున్న ఈ జావా బైక్ ను మహింద్రా డీలర్స్ వద్ద 5000లతో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. 1970, 80 దశకాలలో జావా బైకులు ఎక్కువ ప్రజాధరణ పొందాయి. మళ్లీ ఇవి రీ ఎంట్రీ ఇవ్వడం బైక్ ప్రేమికులకు ఎంతో ఆనందదాయకం.



మరింత సమాచారం తెలుసుకోండి: