మొదటినుంచీ.. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ.. సినిమాలు చేస్తూ దర్శకుడు రవిబాబు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అల్లరి, నచ్చావులే, అదిగో పందిపిల్ల వంటి పలు చిత్రాల ద్వారా తనదైన మార్కుతో.. తనకంటూ.. టాలీవుడ్లో ఓ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు రవిబాబు. వరంగల్
జిల్లా కలెక్టర్ ఆమ్రాపాలిపై..
డైరెక్టర్ రవిబాబు.. పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నా కథకు కారణం ఆమ్రాపాలినే అని.. ఓ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజాగా తెలిపారు.
అంతేకాకుండా.. ఆయన ఎక్కువగా.. అనసూయ, అవును, అవును-2 వంటిసస్పెన్స్,
థ్రిల్లర్,
హర్రర్ చిత్రాలను తీయడానికే ప్రాధాన్యం ఇస్తూంటారు. అదుగో
సినిమా కోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డాడు. ఆ సమయంలో ఎన్నో సినిమాల్లో నటించేందుకు అవకాశాలు వదులుకొని మరీ ఆ
సినిమా తీశారు. కానీ అది అంతగా వర్కౌట్ కాలేదు. దీంతో మరోసారి తనకు కలిసి వచ్చిన
థ్రిల్లర్, హారర్ జానర్పై దృష్టి పెట్టాడు.
తాజాగా అయన ఆవిరి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కాగా.. ఇప్పుడు ఆయన కథలోకి..
కలెక్టర్ ఆమ్రాపాలి ఎందుకొచ్చారంటే.. ఆయన ‘అదుగో’
సినిమా చేస్తున్న సమయంలో.. టీవీలో వరంగల్ జిల్లాకి కలెక్టర్గా పనిచేస్తున్న ఆమ్రాపాలి గురించి ఓ న్యూస్ వచ్చింది. తన కలెక్టరేట్ భవనంలో దెయ్యం ఉందని.. అటువైపు వెళ్లడానికి కూడా తనకు భయమేస్తుందని వార్తలు వచ్చాయి.ఇప్పుడు ఆ న్యూస్ని బేస్ చేసుకునే ‘ఆవిరి కథను’ డెవలప్ చేసినట్లు రవిబాబు చెప్పాడు.
ఈ సినిమాని దిల్
రాజ్ సమర్పిస్తున్నారు.
నవంబర్ 01 న ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటికే విడుదలైన
సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఓ ఇంట్లో దెయ్యం ఉండటం, చిన్న పాపతో స్నేహం చేయడం.. తల్లిదండ్రులు ఖంగారు పడటం.. పాప కనిపించకుండా పోవడం.. ఇలా ప్రతీ సీన్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా చేయడంలో ఆవిరి ట్రైలర్
సక్సెస్ అయింది