సినిమా ఇండస్ట్రీలో కొంత మంది డెడికేషన్ చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వరుస షూటింగ్స్ లో పాల్గొంటూ.. కొన్ని సార్లు తమ ఆరోగ్యం పరిస్తితి కూడా లెక్కచేసేవారు కాదని అంటుంటారు. కమిట్ మెంట్ ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మూవీ పూర్తి చేసే బాధ్యత వారు తీసుకునేవారట. అలాగే ఈ తరం నటుల్లో మెగాస్టార్ చిరంజీవి మరికొంత మంది నటులు నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. ఇచ్చిన కమిట్ మెంట్ తో ఉండేవారని విన్నాం. తాజాగా బాలీవుడ్ లో వరుస విజయాలు అందుకుంటున్న నటి కంగనా రౌనత్ ఒకప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘ఏక్ నిరంజన్’ మూవీలో నటించింది. చాలా కాలం తర్వాత తెలుగు లో మణికర్ణిక సినిమాతో కనిపించింది.
తాజాగా వృత్తి పట్ల కంగనా రనౌత్ కు నిబద్ధత చాలా ఎక్కువని... తన పాత్రకు న్యాయం చేయడానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటుందని ఆమె సోదరి రంగోలి తెలిపింది. కంగనా రౌనత్ బాధ్యతలు ఆమె సోదరి రంగోలీ తీసుకున్నారు.. ప్రతి విషయంలోనూ తన సోదరి గురించి సోషల్ మీడియాలో అప్ డేట్ చేస్తుంది. తాజాగా ఓ సందర్భంలో మాట్లాడుతూ.. జయలలిత బయోపిక్ 'తలైవి' కోసం రోజుల వ్యవధిలోనే ఆమె 10 కేజీల బరువు పెరిగిందని, ఆమె శరీరంలో కొవ్వు శాతం బాగా పెరిగిందని చెప్పింది. తన ఆరోగ్యానికి ప్రమాదమని తెలిసి కూడా బరువు పెరిగిందని తెలిపింది.
'తను వెడ్స్ మను' సినిమా షూటింగ్ సమయంలో కంగన బైక్ యాక్సిడెంట్ కు గురైందని, అప్పుడు ఆమె కాలుకి 52 కుట్లు పడ్డాయని రంగోలి చెప్పింది. ఇక మణికర్ణిక విషయంలో ఎన్ని గొడవలు జరిగాయో తెలిసిందే.. చివరల్లో ఆమె స్వయంగా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. 'మణికర్ణిక' షూటింగ్ సమయంలో కూడా తన సహనటుడు పొరపాటున మెటల్ రాడ్ తో కంగన తలపై కొట్టాడని, అప్పుడు నుదుటికి 15 కుట్లు పడ్డాయని వెల్లడించింది. ఆ సమయంలో ఆమె కత్త యుద్దాల్లో పాల్గొంటూ.. ఎన్నో గాయాలపాలైనా లెక్కచేయకుండా తన బాధ్యతలు నెరవేర్చారని అన్నారు.