తెలుగు ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే అనేక అవకాశాలు పొందింది ఎవరంటే.. రకుల్ ప్రీత్ సింగ్ అనే చెప్పాలి. అయితే ఈ మధ్య కాలంలో రకుల్ కు సినిమా ఆఫర్లు తక్కువ ఆయ్యాయనే చెప్పాలి. తాజాగా కమల్ హాసన్ తాజా చిత్రంలో ఇండియన్ 2లో రకుల్ నటిస్తోంది. ఇండియన్–2 చిత్రం షూటింగ్ లో ప్రమాదం జరిగిన సమయంలో రకుల్ అక్కడ లేదు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. అందుకు గల కారణాలను విశ్లేషించుకుంటోంది. మిగతా హీరోయిన్లలా తాను రెమ్యూనరేషన్ కోసం పట్టుపట్టడం లేదని, షూటింగులకు టైం సెన్స్ పాటిస్తున్నానంటోంది.
గతంలో తాను అందాల ఆరబోతకే అధిక ప్రాధాన్యత ఇచ్చానని, ఇప్పుడు తన తప్పులు తెలుసుకుంటున్నానంటోంది రకుల్. నటనకు ప్రాధాన్యత కలిగిన పాత్రలను ఎంపిక చేసుకోకుండా కేవలం గ్లామర్ కే పరిమితం అయ్యానని, ఫలితం అవకాశాలు దూరం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఇంటినుంచే భోజనం తెచ్చుకుంటానని, మిగతా వారిలా షూటింగుల్లో ఏది బడితే అది తిననంటోంది. తమిళంలోనే రెండు చిత్రాలు రకుల్ చేతిలో ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కు జంటగా ఇండియన్–2 చిత్రంలో నటిస్తోంది. మరో చిత్రాన్ని శివకార్తికేయన్ తో చేస్తోందని చెప్పుకొచ్చారు.
తెలుగులో చాలా గ్యాప్ తరువాత ఒక చిత్రంలో నటిస్తోంది. అంతేకాదు గత ఏడాది హిందీ చిత్రం ‘దేదే ప్యార్ దే’ విజయం రకుల్ ప్రీత్ సింగ్ కు బాలీవుడ్ లో అవకాశాలను తెచ్చిపెట్టింది. ఇందులో అజయ్ దేవగన్ హీరోగా నటించారు. మళ్లీ అజయ్, రకుల్ ప్రీత్ సింగ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ‘ధమాల్’ ఫ్రాంచైజీ డైరెక్టర్ ఇంద్రకుమార్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
ఇందులో యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ఓ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మార్చిలో ప్రారంభం అవుతోంది. సినిమాల్లో ఎంత బిజీగా వున్నా జిమ్ లో మాత్రం వర్కవుట్స్ మానదు రకుల్. సోషల్ మీడియాలో తన వర్కవుట్ ఫోటోలతో ఎప్పుడు సందడి చేస్తూనే ఉంటుంది.