ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాదంలో మరణాలు, తీవ్ర గాయాలు అన్న వార్తలు ప్రతిరోజు చూడాల్సి వస్తుంది.  ఈ రోడ్డు ప్రమాదంలో కొంత మంది ప్రాణాలు పోతుంటే..మరికొంత మంది అంగవైకల్యంతో బాధపడుతుంటే..ఎంతో మంది అనాధలుగా మిగిలిపోతున్నారు.  డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవింది వాహనాలు నడపడం ఇందుకు ఎక్కువగా కారణం అవుతున్నాయని పోలీసులు అంటున్నారు.  డ్రంక్ అండ్ డ్రైవ్ లు ఎన్ని నిర్వహించినా..ఈ ప్రమాదాలను మాత్రం అరికట్టలేక పోతున్నారు అధికారులు. 

టాలీవుడ్ సినీ నటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.  రవితేజ సోదరుడు భరత్ కూడా రోడ్డు ప్రమాదంలో దారుణంగా మరణించారు.  తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో అంత్యాక్షరి సన్నివేశంలో ‘రోజ్ రోజ్ రోజాపువ్వా’అంటూ రాజశేఖర్ డూప్ గా నటించిన ఆంజనేయులు ఆయన భార్యకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు అయ్యాయి.  ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో ఆయన రాజశేఖర్ గెటప్పులో నటించారు. 

ఇందిరానగర్‌లో నివసించే ఆంజనేయులు భార్యతో కలిసి శనివారం రాత్రి ద్విచక్రవాహంపై గచ్చిబౌలి బయలుదేరారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద వీరి బైక్‌ను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆంజనేయులు కాళ్లు, చేతులకు గాయాలు కాగా, ఆయన భార్య కూడా గాయపడింది. ఘటనపై ఆంజనేయులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: