ఈమధ్య జరిగిన ఎన్నికలలో బెంగుళూరు సిటీ నుండి పోటీచేసి ఓడిపోయిన ప్రకాష్ రాజ్ తన ఓటమి షాక్ నుండి తేరుకుని తిరిగి సినిమాలలో నటిస్తూ బిజీగా కాలం గడుపుతున్నాడు. వెంకటేశ్ నాగచైతన్యలు కలిసి నటిస్తున్న ‘వెంకీ మామ’ మూవీలో కీలక పాత్ర చేస్తున్న ప్రకాష్ రాజ్ ఈమధ్య ఆమూవీ షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఒక మహిళతో అనుకోకుండా అతడు ఒక సెల్ఫీ వివాదంలో ఇరుక్కున్న విషయాన్ని స్వయంగా ప్రకాష్ రాజ్ మీడియాకు తెలియచేసాడు.

కాశ్మీర్ ప్రాంతలో ప్రకాష్ రాజ్ మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఒక మహిళ తన కూతురుతో చాల వేగంగా తన వద్దకు వచ్చి తాను ప్రకాష్ రాజ్ అభిమానిని అని తెలియచేసి ఒక సెల్ఫీని ప్రకాష్ రాజ్ తో కలిసి తీసుకుంటానని అడిగిందట. దీనికి వెంటనే ప్రకాష్ రాజ్ ఓకె చెప్పడంతో ఒక సెల్ఫీని తీసుకోవడం కూడ పూర్తి అయింది. 

అయితే ఈ సంఘటన దూరం నుంచి చూసిన ఆ మహిళ భర్త వేగంగా అక్కడకు వచ్చి ఆమె సెల్ ఫోన్ తన చేతిలోకి లాక్కుని ప్రకాష్ రాజ్ తో తీయించుకున్న ఆ సెల్ఫీని డిలీట్ చేయడానికి ప్రయత్నించి ఆమెతో ఘర్షణకు దిగాడట. దీనితో షాక్ అయిన ప్రకాష్ రాజ్ ఆ వ్యక్తిని కారణం అడిగితే అతడు చెప్పిన కారణం విని తన మైండ్ బ్లాంక్ అయిపోయింది అని అంటున్నాడు ప్రకాష్ రాజ్. 

గత ఎన్నికల ప్రచార సమయంలో తాను నరేంద్ర మోడీని విమర్శిస్తూ కామెంట్స్ చేసిన సందర్భంలో మోడీని విపరీతంగా అభిమానించే ఆవ్యక్తి భార్య సెల్ ఫోన్ లో తన ఫోటో ఉండటం తాను సంహించలేనని ఆవ్యక్తి ఆవేశంతో ప్రకాష్ రాజ్ కు చెప్పాడట. దీనితో అతడి  మాటలకు ప్రకాష్ రాజ్ షాక్ అవ్వడమే కాకుండా మోడీని విమర్శించే హక్కు కూడ తనకు లేదా అని అంటూ భవిష్యత్ లో తాను మోడీని విమర్శించినందుకు తనకు సినిమాలు తగ్గిపోయినా ఆశ్చర్యం లేదు అని అంటూ ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: