బాలీవుడ్ బ్యూటీ మహిమా చౌదరి ఈమధ్య హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమానికి అతిధిగా వచ్చింది. ఈ సందర్భంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆమె మాట్లాడుతూ టాలీవుడ్ టాప్ హీరోల పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా వారందరిలోకి చిరంజీవి అంత రొమాంటిక్ పర్సన్ వేరొకరు ఉండరనీ చిరంజీవి కళ్ళు చాల బాగుంటాయి అంటూ కామెంట్స్ చేసింది. 

అంతేకాదు చిరంజీవి కొడుకు చరణ్ కూడ చాల రొమాంటిక్ గా ఉంటాడని చెపుతూ మెగా ఫ్యామిలీ పై తనకున్న అభిమానాన్ని సాన్నిహిత్యాన్ని తెలియ చేసింది. గతంలో నాగార్జునతో తనకు నటించే అవకాసం వచ్చినా తాను వదులుకున్న సందర్భాన్ని వివరిస్తూ నాగ్ తో సినిమా చేయలేకపోయినందుకు తాను ఇప్పటికీ ఎంతో బాధపడుతున్న విషయాన్ని వివరించింది. 

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కు తాను వీరాభిమానిని అంటూ అతడి స్టైల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరికీ లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి తనకు నమ్రత శిరోద్కర్ మంచి స్నేహితురాలు అని చెపుతూ మహేష్ బాబు తనకు తెలియదు అంటూ కామెంట్స్ చేసి మీడియా వర్గాల మైండ్ ను బ్లాంక్ చేసింది. 

అయితే ఆతరువాత తన కామెంట్స్ పై తానే వివరణ ఇస్తూ మహేష్ హీరో అన్న విషయం నమ్రతకు భర్త అన్న విషయం తనకు తెలుసు కానీ అతడితో ఎలాంటి వ్యక్తిగత పరిచయం లేదనీ అంటూ మరో షాక్ ఇచ్చింది. దీనితో మహిమా చౌదరి మహేష్ పై చేసిన కామెంట్స్ మహేష్ అభిమానులకు కూడ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం పెద్దగా సినిమాలలో కనిపించని ఈ బ్యూటీ మీడియాలో సంచలన వార్తలలో కనిపించడానికి ఇలా మహేష్ తనకు తెలియదు అంటూ తెలుగు మీడియాలో వార్తలకు హాట్ న్యూస్ గా మారడానికి ఇలా ప్రయత్నించి ఉంటుంది అంటూ కొందరు ఆమెపై సెటైర్లు వేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: