బిగ్ బాస్ రియాల్టీ షో పై టీవీ యాంకర్ శ్వేతారెడ్డి నటి గాయత్రీ గుప్త చేసిన ఆరోపణలకు భిన్నంగా సీనియర్ నటి హేమ స్పందించారు.  బిగ్ బాస్ రియాల్టీ షో లో పాల్గొంటే సంతృప్తి పర్చాలని  వేధిస్తున్నారని యాంకర్ శ్వేతారెడ్డి, ఫిదా ఫేమ్  గాయత్రీ గుప్త గుప్తా లు  ఆరోపించిన విషయం తెలిసిందే.  బిగ్ బాస్ షో లో కాస్టింగ్ కౌచ్ వంటి తీవ్రమైన సమస్య ఉంటే హీరో నాగార్జున హోస్ట్  చేయడానికి ఎందుకు ఒప్పుకుంటారని హేమ ప్రశ్నించింది. 


ఒకవేళ బిగ్ బాస్ -3 నిర్వాహకులు పార్టిసిపెంట్స్ తో అసభ్యంగా మాట్లాడి ఉంటే అప్పుడే స్పందించాలి ... కానీ నెల రోజుల క్రితం జరిగిందని ఇప్పుడు బయటకు వచ్చి చెప్పడం కరెక్టు కాదని అంది .  సెలెక్ట్ కాలేదు అని తెలిసిన తర్వాత ఇలాంటి ఆరోపణలు చేయడం ఏమాత్రం సమంజసం కాదన్న హేమ , తనతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే అప్పుడే వాళ్ళ చొక్కా పట్టుకొని నిలదీస్తానని చెప్పారు.  బిగ్ బాస్-3 షో లో తనకు అవకాశం వస్తే తప్పకుండా పాల్గొంటానని, పూర్తి  రాజకీయాల్లో చేరాలనుకుంటున్న తనకు బిగ్ బాస్ రియాల్టీ షో చక్కటి వేదిక అవుతుందని అన్నారుస్థాయి .


 బిగ్ బాస్ -3 రియాల్టీ షో ప్రారంభం కాకముందే వివాదాల్లో చిక్కుకుంది . బిగ్ బాస్ షో లో పాల్గొనే వారిని లైంగికంగా వేధిస్తున్నారని యాంకర్ శేత్వా రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే . అంతటితో  ఆగకుండా జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు .


మరింత సమాచారం తెలుసుకోండి: