పవన్ కళ్యాణ్ తిరిగి యూటర్న్ తీసుకుని సినిమాలలోకి వస్తున్నాడు అని వార్తలు రావడంతో పవన్ చేయబోయే సినిమాల దర్శకుల పేర్ల గురించి ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. పవన్ తాను తిరిగి సినిమాలలో నటించాలి అంటే ఒక మంచి కథ కావాలి కాబట్టి అలాంటి కథ దొరికినప్పుడు మాత్రమే తాను సినిమా చేస్తాను అంటూ పవన్ తనను కలుస్తున్న అనేకమంది దర్శక నిర్మాతలకు చెపుతున్నట్లు టాక్. 

ఈ నేపధ్యంలో పవన్ దృష్టి ‘ఆర్టికల్ 15’ పై పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం జూన్ మాసంలో విడుదలైన ఈ బాలీవుడ్ మూవీకి విపరీతమైన ప్రశంసలు వచ్చాయి. హీరో ఆయుష్ మాన్ ఖురానా ఇషా టల్వర్ లు హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీలో బలమైన సామాజిక నేపధ్యంతో కూడిన కథ ఉంది. 

భారత రాజ్యాంగంలోని ‘ఆర్టికల్ 15’ ద్వారా మనకు సంక్రమించిన హక్కులను కొందరు ఎలా హరించి వేసి ముఖ్యంగా గ్రామీణ మహిళల పై జరుగుతున్న అత్యాచారాలను కొన్ని అసాంఘీక సంఘటనలను దృష్టిలో పెట్టుకుని వాస్తవ సంఘటనలను ఆధారంగా తీసిన ఈ మూవీ సక్సస్ అవ్వడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడ పొందింది. 

ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయాలని అజిత్ ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ ఆలోచనలు ఉన్నాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి. తన ఫిలిం రీ ఎంట్రీకి ఇలాంటి కథతో కూడిన మూవీ బాగుంటుంది అని చెప్పడంతో పవన్ కు అత్యంత సన్నిహితుడైన దర్శకుడు డాలీ ఈ మూవీ కథను ఎంత వరకు తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా పవన్ అభిమానులకు నచ్చే విధంగా మార్చగలము అన్న విషయమై ప్రస్తుతం డాలీ తన స్టోరీ టీమ్ తో చర్చలు జరుపుతున్నట్లు టాక్..    


మరింత సమాచారం తెలుసుకోండి: