ఎక్కడ చూసినా... హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు మన దేశంలో క్షణక్షణానికి ఎన్నో జరుగుతున్నాయి. ఈ సంఘటనలు చెప్పలేనంత దారుణంగా ఉంటున్నాయి. తాజాగా జరిగిన సంఘటన చూస్తుంటే ఇంట్లో ఉన్న అమ్మాయిలకు కూడా సేఫ్టీ లేదనే విషయం తెలిసిపోతుంది. దేశంలో మగాళ్లు ఎంత క్రూరంగా మారుతున్నారో ఈ సంఘటనే ఉదాహరణ.


వివరాల్లోకి వెళితే.... మధ్యప్రదేశ్‌లో రేవా పట్టణంలోని ఘర్19 పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తున్న దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. అయితే నవంబర్ 19 వ తారీఖున.. ఈ దంపతులు ఒక పని నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లారు.. అప్పుడు ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు వారి ఇంట్లోనే ఒంటరిగా ఉన్నారు.

 

అయితే ఇది గమనించిన ముగ్గురు స్థానిక యువకుల... సరిగ్గా 12 గంటల సమయంలో అక్కచెల్లెల ఉన్న ఇంట్లోకి దొంగతనంగా ప్రవేశించారు. ఆ తర్వాత ఆ ముగ్గురిలో ఇద్దరు చెల్లిని పట్టుకోగా.. ఒకడు అక్కని ఒక గదిలోకి తీసుకెళ్లి ఆమెపై మానభంగం చేశాడు. ఆ తర్వాత చెల్లిని బట్టలు విప్పించి లైంగికంగా వేధించారు. పాపం.. ఆ అక్కచెల్లెల్లు ఎంతో ఏడుస్తూ వదిలేయమని ఎంత బతిమాలినా.. ఆ ముగ్గురు కిరాతకులకు ఏమాత్రం జాలి కలగలేదు.


కొంత సమయం తర్వాత పని ముగించుకుని తల్లిదండ్రులు ఇద్దరూ వారి ఇంటికి వచ్చేశారు. దీంతో అప్పటివరకు ఏడుస్తూ ఉన్న అక్క చెల్లెలు... తల్లిదండ్రుల వద్దకి వచ్చి తమపై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పి బోరుమని విలపించారు. తమ పిల్లలికి జరిగిన దారుణాన్ని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు తల్లడిల్లి పోయారు. తర్వాత పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు వెంటనే ఇద్దరిని పట్టుకున్నారు. ఒకడు పరారీలో ఉన్నాడు. అతన్ని కూడా రెండు మూడు రోజుల్లో పట్టుకుంటాం.... గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: