45 సంవత్సరాల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్‌ పథకంపై అధికార, విపక్ష సభ్యుల మధ్య ఏపీ అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ప్రశ్నోత్తరాల సమయంలో  పెన్షన్ పథకంపై టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతూ మహిళలకు పెన్షన్‌ పథకంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించగా,  మొదట మంత్రి పెద్దిరెడ్డి , ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్పందిస్తూ... మోసం చేయడం అబద్ధాలు ఆడటం మా ఇంట వంటా లేదని చెప్పుకొచ్చారు.


ఎన్నికలకు వెళ్లే ముందు ఈ మేనిఫెస్టో చూపించి ఓట్లు అడిగామని. ఈ మేనిఫెస్టో చూసిన తర్వాతే ప్రజలు మాకు ఓట్లేశారని జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికలప్పుడు ‘జగన్ అనే నేను..’ ఏం మాట్లాడానో టీవీ స్క్రీన్‌లలో చూపిస్తాన ని తెలిపారు. చూసిన తర్వాత మీకు మనస్సాక్షి ఉంటే క్షమాపణ చెప్పమని కోరుతున్నానని జగన్,  టీడీపీ సభ్యులనుద్దేశించి అన్నారు.  ఈ సందర్భంగా.. అసెంబ్లీలోనే ఎన్నికల సమయంలో మాట్లాడిన స్పీచ్‌ను సభలో ప్రసారం చేసి వినిపించారు.


వీడియోలో ఏముందంటే ... " నాన్నగారు కలలు కన్న స్వప్నం ప్రతి అక్క, చెల్లెమ్మ లక్షాధికారి కావాలి. అక్కా, చెల్లెమ్మ సంతోషంగా ఉంటే ఇల్లు సంతోషంగా ఉంటుంది.. రాష్ట్రం కూడా బాగుంటుందని గట్టిగా నమ్మేవారిలో మొట్టమొదటి వ్యక్తిని నేను అని గర్వంగా చెబుతున్నాను. వైఎస్సార్ చేయూత అనే కార్యక్రమం ద్వారా ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ అక్కలకు 45 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించాం. ఈ నిర్ణయాన్ని కొందరు వెటకారం చేశారని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: